DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్లో పవర్ షేరింగ్ వివాదం మలుపులు తిరుగుతోంది. 2023 ఎన్నికల తర్వాత, ఒప్పందం ప్రకారం, 2.5 ఏళ్ల తర్వాత తనకు సీఎం పోస్ట్ ఇవ్వాలని డీకే శివకుమార్ కోరుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు కూడా తానే సీఎంగా ఉండాలని భావిస్తున్నారు.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ…
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది.
Congress: కర్ణాటక కాంగ్రెస్లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
Karnataka Politics: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం గురించి భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతో గేట్ వద్ద హడావుడి కొనసాగింది. తరువాత మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధపడ్డారు.
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య ‘కుర్చీ’ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొన్నట్లు తెలుస్తోంది.