Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
- కర్ణాటక సీఎంపై మార్పుపై కాంగ్రెస్ తర్జనభర్జన..
- సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ‘పవర్’ పంచాయతీ..
- డిసెంబర్ 1న కర్ణాటక కొత్త సీఎంపై నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 1 పార్లమెంట్ సమావేశానికి ముందు సీఎం ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయించనుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు వారం రోజులుగా డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాహుల్ నుంచి డీకేకు మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ ‘‘ దయచేసి వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా’’ అని డీకేకు వాట్సాప్ టెక్ట్స్ మెసేజ్ పంపించారు.
Read Also: The Pet Detective : ఓటీటీలోకి అనుపమ సూపర్ హిట్ సినిమా
Also Read
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
మరోవైపు, డీకే నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సోనియాగాంధీతో అపాయింట్మెంట్ కొరినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చేగౌడతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత, ప్రియాంక్ ఖర్గేతో మరో 20 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ప్రైవేట్గా మాట్లాడారు. రెండు శిబిరాలు కూడా సంయమనం పాటించాలని ప్రియాంక్తో రాహుల్ చెప్పారని తెలుస్తోంది.
ఒక వేళ నాయకత్వ మార్పు జరిగితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేక నివారించడానికి ఒక వేళ డీకే శివకుమార్ సీఎం అయితే, పార్టీలో మిగతా వర్గాల వారికి కీలక పోస్టులు ఇచ్చేలా ఒక ఫార్ములాను కాంగ్రెస్ అణ్వేషిస్తోంది. కర్ణాటక పీసీసీ పదవి, డిప్యూటీ సీఎం పదవుల్ని ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
-
Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
-
Ravindra Jadeja: నో బాల్తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!