Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
- కర్ణాటక సీఎంపై మార్పుపై కాంగ్రెస్ తర్జనభర్జన..
- సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ‘పవర్’ పంచాయతీ..
- డిసెంబర్ 1న కర్ణాటక కొత్త సీఎంపై నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 1 పార్లమెంట్ సమావేశానికి ముందు సీఎం ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయించనుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు వారం రోజులుగా డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాహుల్ నుంచి డీకేకు మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ ‘‘ దయచేసి వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా’’ అని డీకేకు వాట్సాప్ టెక్ట్స్ మెసేజ్ పంపించారు.
Read Also: The Pet Detective : ఓటీటీలోకి అనుపమ సూపర్ హిట్ సినిమా
Also Read
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
మరోవైపు, డీకే నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సోనియాగాంధీతో అపాయింట్మెంట్ కొరినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చేగౌడతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత, ప్రియాంక్ ఖర్గేతో మరో 20 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ప్రైవేట్గా మాట్లాడారు. రెండు శిబిరాలు కూడా సంయమనం పాటించాలని ప్రియాంక్తో రాహుల్ చెప్పారని తెలుస్తోంది.
ఒక వేళ నాయకత్వ మార్పు జరిగితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేక నివారించడానికి ఒక వేళ డీకే శివకుమార్ సీఎం అయితే, పార్టీలో మిగతా వర్గాల వారికి కీలక పోస్టులు ఇచ్చేలా ఒక ఫార్ములాను కాంగ్రెస్ అణ్వేషిస్తోంది. కర్ణాటక పీసీసీ పదవి, డిప్యూటీ సీఎం పదవుల్ని ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
-
Preity Zinta: AI డీప్ఫేక్లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!