DK Shivakumar: కర్ణాటకలో కొనసాగుతున్న పవర్ షేరింగ్ వివాదం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శివకుమార్ పోస్ట్ వైరల్గా మారింది.
READ MORE: Manchu Lakshmi: కుటుంబ కలహాలపై.. మొదటిసారి స్పందించిన మంచు లక్ష్మి
Also Read
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
రోజు రోజుకూ వేడెక్కుతున్న వివాదం..!
కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీ వివాదం రోజు రోజుకూ వేడెక్కుతోంది. హైకమాండ్ డీకే శివకుమార్ను 2.5 సంవత్సరాలు వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు సిద్ధరామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించలేకపోతుందనే వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పంద కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదటి రెండునరేళ్ల పదవీకాలం డిమాండ్ చేశారు.. కానీ సిద్ధరామయ్య సీనియారిటీని పేర్కొంటూ తనకే మొదటి విడత సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. సుదీర్ఘ చర్చ తర్వాత, రాజీ కుదిరింది.
READ MORE: Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
దీంతో మొదటి విడతలో భాగంగా సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ కాలక్రమేణా, సిద్ధరామయ్య వైఖరి మారిపోయింది. జూలై 2025 వరకు.. “పూర్తి ఐదు సంవత్సరాలు నేనే సీఎంగా కొనసాగుతాను.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు” అని పదే పదే చెప్పారు. అయితే, నవంబర్ 22న మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమైన తర్వాత.. సిద్ధరామయ్య స్వరం మారిపోయింది. ఈ నిర్ణయాన్ని హైకమాండ్కు వదిలేశారు. ఒకవేళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినా.. పార్టీకి చెందిన కీలక బాధ్యతలను సిద్ధరామయ్యకు కట్టబెడతారని పార్టీ అధికారుల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య దాదాపు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకటిన్నర సంవత్సరాలు సమన్వయ కమిటీ అధిపతిగా పనిచేశారు. కాబట్టి, ఆయనకు తిరిగి పార్టీ బాధ్యతలను అప్పగించడం నైతికంగా అవసరమని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. డీకే శివకుమార్ నైపుణ్యం, ఓపికతో వేచి చూస్తున్నారు. కర్ణాటకలో అధికార సమతుల్యత రాజస్థాన్ లేదా ఛత్తీస్గఢ్ లాగా లేదని పార్టీలోనే ఆయనకు గుర్తింపు ఉంది. కాగా.. ఈ 2.5 సంవత్సరాల ఒప్పందం ఫలిస్తుందా..? భారత రాజకీయాల్లో మరో అసంపూర్ణ కథగా మిగిలిపోతుందా అనేది రాబోయే వారాల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!