Karnataka: కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయలు.. ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
READ MORE: Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజధానిలో వివరంగా చర్చించనున్నారు. నవంబర్ చివరి నాటికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకోవడం అవసరమని నిఘా నివేదికలు పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించినట్లు కర్ణాటక సీఎంఓ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సిద్ధరామయ్య ఖర్గేతో సమావేశమై పాలనపై రాజకీయ సంక్షోభం ప్రభావం గురించి వివరంగా చర్చించారు. సిద్ధరామయ్య పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు పిలిచినా ఢిల్లీకి వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
READ MORE: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. “పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా/తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించాం. మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదు. నాయకత్వ మార్పులు కేవలం ఊహాగానాలు, మీడియా కల్పించినవే” అని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం గురించి ఖర్గేతో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ చివరికి, హైకమాండ్ ఏమి చెప్పినా.. మనమందరం పాటించాల్సిందే అన్నారు. తాను అయినా, డీకే శివకుమార్ అయినా.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!