Karnataka: కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయలు.. ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
READ MORE: Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..
Also Read
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజధానిలో వివరంగా చర్చించనున్నారు. నవంబర్ చివరి నాటికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకోవడం అవసరమని నిఘా నివేదికలు పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించినట్లు కర్ణాటక సీఎంఓ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సిద్ధరామయ్య ఖర్గేతో సమావేశమై పాలనపై రాజకీయ సంక్షోభం ప్రభావం గురించి వివరంగా చర్చించారు. సిద్ధరామయ్య పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు పిలిచినా ఢిల్లీకి వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
READ MORE: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. “పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా/తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించాం. మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదు. నాయకత్వ మార్పులు కేవలం ఊహాగానాలు, మీడియా కల్పించినవే” అని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం గురించి ఖర్గేతో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ చివరికి, హైకమాండ్ ఏమి చెప్పినా.. మనమందరం పాటించాల్సిందే అన్నారు. తాను అయినా, డీకే శివకుమార్ అయినా.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!