Karnataka: కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయలు.. ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
READ MORE: Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజధానిలో వివరంగా చర్చించనున్నారు. నవంబర్ చివరి నాటికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకోవడం అవసరమని నిఘా నివేదికలు పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించినట్లు కర్ణాటక సీఎంఓ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సిద్ధరామయ్య ఖర్గేతో సమావేశమై పాలనపై రాజకీయ సంక్షోభం ప్రభావం గురించి వివరంగా చర్చించారు. సిద్ధరామయ్య పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు పిలిచినా ఢిల్లీకి వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
READ MORE: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. “పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా/తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించాం. మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదు. నాయకత్వ మార్పులు కేవలం ఊహాగానాలు, మీడియా కల్పించినవే” అని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం గురించి ఖర్గేతో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ చివరికి, హైకమాండ్ ఏమి చెప్పినా.. మనమందరం పాటించాల్సిందే అన్నారు. తాను అయినా, డీకే శివకుమార్ అయినా.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.
తాజావార్తలు
-
Astrology: చిన్న విషయాన్నీ ఎక్కువగా ఆలోచించే 4 రాశులవారు.. మీలో కూడా ఈ లక్షణం ఉందా?
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!