Karnataka: కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయలు.. ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
READ MORE: Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజధానిలో వివరంగా చర్చించనున్నారు. నవంబర్ చివరి నాటికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకోవడం అవసరమని నిఘా నివేదికలు పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించినట్లు కర్ణాటక సీఎంఓ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సిద్ధరామయ్య ఖర్గేతో సమావేశమై పాలనపై రాజకీయ సంక్షోభం ప్రభావం గురించి వివరంగా చర్చించారు. సిద్ధరామయ్య పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు పిలిచినా ఢిల్లీకి వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
READ MORE: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. “పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా/తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించాం. మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదు. నాయకత్వ మార్పులు కేవలం ఊహాగానాలు, మీడియా కల్పించినవే” అని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం గురించి ఖర్గేతో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ చివరికి, హైకమాండ్ ఏమి చెప్పినా.. మనమందరం పాటించాల్సిందే అన్నారు. తాను అయినా, డీకే శివకుమార్ అయినా.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!