Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బలాబలాలపై కాంగ్రెస్ అంచనా..
- కర్ణాటక కాంగ్రెస్లో వర్గ పోరు..
- సీఎం మార్పుపై జోరుగా చర్చ..
- సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బలాలపై అధిష్టానం అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక కాంగ్రెస్లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతున్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటకలో నాయకత్వ మార్పు లాభాలు, నష్టాల గురించి కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. సీఎం సిద్ధరామయ్య వారసుడిగా డీకే శివకుమార్కే అవకాశం ఉందని, ఇందులో మూడో వ్యక్తి పేరు లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read
- Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
Read Also: Bitcoin Crash: క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ శకం ముగిసిందా? బిట్కాయిన్ క్రాష్కు కారణాలు ఏంటి..
ఇద్దరు నాయకుల బలాబలాల గురించి కాంగ్రెస్ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. సిద్ధరామయ్యకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓబీసీ వర్గాల్లో మంచి మద్దతు ఉంది, ప్రజా నాయకుడిగా పేరుంది. మరోవైపు, డీకే శివకుమార్కు సంస్థాగత సామర్థ్యాలు, ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలు ఉన్నాయని, ఇవి రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనంగా ఉంటాయని కొందరు నాయకులు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో వరస పరిణామాల నేపథ్యంలో డీకేకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. అయితే, ఇలాంటి ఒప్పందం ఏం జరగలేదని సిద్ధరామయ్య సన్నిహితులు చెబుతున్నారు. సీఎంగా పూర్తి కాలం ఆయనే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై స్పందించడానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిరాకరించారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!