శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమంలో భాగంగా శనివారం 108 దివ్యదేశ మూర్తుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిమంది వీక్షించి తరించారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తూ సంచరిస్తుంటాడు. ఆలయాల్లో, ధ్యానం చేసేవారి మనసులలో భగవంతుడు కొలువై వుంటాడు. విగ్రహ రూపంలో ఆలయాల్లో వుండే రూపం మనకు కనిపిస్తుంది. అవతరాల్లో వుండే రూపం ఆయా కాలాల్లో కనిపిస్తుంది. వైకుంఠం…
మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో…
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4…
కలియుగ వైకుంఠం తిరుమల రథ సప్తమి వేడుకలకు సిద్ధమయింది. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.రథ సప్తమి నాడు ఏటా భక్తులతో తిరుమల సందడిగా వుంటుంది. అయితే తాజా పరిస్థితుల్లో భక్తులకు తిరుమల వెళ్ళి స్వయంగా వేడుకలను చూసే అవకాశం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సప్త వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు భక్తులతో నిండిపపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయ పద్దతిలో కొనసాగాయి. Read Also: ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను…
మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు.
మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది…
మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు…