కోవిడ్ ఆంక్షలను TTD వినియోగించుకున్నట్టుగా ఇంకెవ్వరూ ఉపయోగించి ఉండరు. తమకు అవసరమైతే రూల్స్ను బయటకు తీస్తుంది. లేకపోతే వాటిని గాలికొదిలేస్తుంది. ఇంతకీ కరోనా నిబంధనల పేరుతో TTD చేస్తోంది ఏంటి.. చెయ్యనిది ఏంటి? కోవిడ్ పేరుతో ఏకాంతంగానే ఉత్సవాలుదేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులోకి రాకముందే అప్రమత్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనతా కర్ప్యూ.. లాక్డౌన్ విధించకముందే TTD వాటిని అమలు చేసి చూపించింది. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకముందే 2020 మార్చి 20…
సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపత దేవస్థానం (టీటీడీ).. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది… సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది… వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి… ఇక, శుక్ర, శని,…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పెద్ద సంఖ్యలో శ్రీవారిని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా అయిపోయింది… ఇక, ఆన్లైన్లో పెట్టే దర్శనం టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో.. సాధారణ భక్తులు, ఆన్లైన్ సేవలకు దూరంగా ఉండేవారికి ఇబ్బందిగా మారింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.. Read Also: Drunk and Drive: వాహనాదారులకు ఊరట..…
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమంలో భాగంగా శనివారం 108 దివ్యదేశ మూర్తుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిమంది వీక్షించి తరించారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తూ సంచరిస్తుంటాడు. ఆలయాల్లో, ధ్యానం చేసేవారి మనసులలో భగవంతుడు కొలువై వుంటాడు. విగ్రహ రూపంలో ఆలయాల్లో వుండే రూపం మనకు కనిపిస్తుంది. అవతరాల్లో వుండే రూపం ఆయా కాలాల్లో కనిపిస్తుంది. వైకుంఠం…
మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో…
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4…
కలియుగ వైకుంఠం తిరుమల రథ సప్తమి వేడుకలకు సిద్ధమయింది. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.రథ సప్తమి నాడు ఏటా భక్తులతో తిరుమల సందడిగా వుంటుంది. అయితే తాజా పరిస్థితుల్లో భక్తులకు తిరుమల వెళ్ళి స్వయంగా వేడుకలను చూసే అవకాశం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సప్త వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు భక్తులతో నిండిపపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయ పద్దతిలో కొనసాగాయి. Read Also: ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను…