Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News All Set For Medaram Maha Jatara

Medaram jatara ready: మేడారం జాతరకు అంతా సిద్ధం

Published Date :February 15, 2022 , 8:40 am
By newsdesk
Medaram jatara ready: మేడారం జాతరకు అంతా సిద్ధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో పాటు మేడారం జాతరకు చవ్చే భక్తుల అవసరాల కోసం చేపట్టిన పనుల తీరు పైనా క్లేత్ర స్థాయిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో మహా జాతర నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు, కరోనా నేపథ్యంలో అమ్మవారి గద్దెలు, జంపన్న వాగులో శానిటేషన్ పకడ్బందీగా చేపడుతూ.. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర సాగిస్తామని స్పష్టం చేశారు. మహాజాతర నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న మంత్రులు అధికారులు. 4 రోజుల పాటు జరిగే మహాజాతర ఘట్టంలో కోటిన్నరమంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పట్లు చేశారు.

జాతర నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించారు అదికారులు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు . జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణకు 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించారు.మొత్తం 4000 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్ వాహనాలతో సేకరించిన చెత్తను వినియోగించనున్నారు. డంప్ యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం 200 డస్ట్ బిన్స్ సిద్ధం చేశారు.

ఇక జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 50 బెడ్లతో సమ్మక్క సారలమ్మ ప్రత్యేక‌ వైద్యశాలను ఏర్పాటు చేశారు స్థానికంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్యశాల, మరో 19 మెడికల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేస్తున్నారు వీటితో పాటు ములుగులో, ఏటూరునాగారం, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, తాడ్వాయి10 పడకల ఆరోగ్య కేంద్రం, పస్రాలోని 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వినియోగించుకునేలా రెడీ చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సు లు, 15 బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు..

ఇక భక్తుల రక్షణ కోసం ఎలాంటి సమస్య రాకుండా ఉండదుకు గత జాతర మాదిరిగానే ఈసారి కూడా 10,300 మంది పోలీస్ సిబ్బందిని జాతర నిర్వహవణలో వినియోగించనున్నారు పోలీసు అధికారులు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పస్త్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులను సిద్దం చేశారు.

జాత‌ర కంటే ముందే భ‌క్తులు మేడారంకు పోటెత్త్తారు. కరోనా భయంతో ముందస్తు మొక్కులకు పెద్ద ఎత్తున భ‌క్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వ‌రంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి వస్తున్న భ‌క్తుల‌తో మేడారం కిక్కిరిసిపోయింది. జాతర ప్రారంభానికి ముందే మేడారం భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల లో ముస్తాబయ్యారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. నేడు పునుగొండ్ల లో పెనుక వంశీయులు స్వామి వారి పడిగ తీసుకుని ఆటవీమార్గం గుండా పస్రా, ప్రాజెక్టు నగర్, కన్నేపల్లి మీదుగా 80కిలో మీటర్లు కాలినడకన మేడారం రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. పగిడిద్దరాజు దేవాలయాన్ని ముస్తాబు చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం ఈనెల 23నుండి పునుగొండ్ల లో తిరగువారం జాతర ఘనంగా నిర్వహిస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • asias big festival
  • bangaram
  • devotees
  • Indrakaran Reddy
  • jaggery

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions