Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు.
Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది.
ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పట్టపగలు బుల్లెట్లు పేలాయి. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు రోగిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో రోగి అక్కడికక్కడే మృతి చెందాడు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు.
మనుస్మృతి బోధించాలన్న లా ఫ్యాకల్టీ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. యూనివర్శిటీలో అది జరగదని డీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ తేల్చిచెప్పారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్కు గుడ్బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.