Hardik Pandya national flag controversy: భారత్ టీ20 వరల్డ్ కప్పులో ఘన విజయం సాధించింది. మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఎంతో జోష్లో సంబరాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. జాతీయ పతాకాన్ని అవమానించాడని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పూణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూణే నగరంలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది వాజిద్ ఖాన్ ఈ ఫిర్యాదు సమర్పించారు. అహ్మదాబాద్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా జాతీయ పతాకాన్ని తన మెడకు చుట్టుకుని అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ జెండాను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించాడని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని వెల్లడించారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఫిర్యాదు అందిందని మాత్రమే అధికారులు నిర్ధారించారు.
READ MORE: Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
అసలు ఏం జరిగింది?
భారత్ టీ20 వరల్డ్ కప్పు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా ప్లేయర్లు సంబరాలు జరుపుకున్నారు. స్టేడియంలో కొంత మంది ప్లేయర్స్ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సైతం త్రివర్ణ పతాకాన్ని మెడకు చుట్టుకుని సంబరాలు జరుపుకున్నాడు. అంతేకాదు.. ఇక్క హార్దిక్ను మాహిక శర్మ ముద్దు పెట్టుకుంది. అతన్ని ఆలింగనం చేసుకొని, ముద్దు పెట్టి అభినందించింది. వీరిద్దరూ కొంత అనుచితంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల నేపథ్యంలో న్యాయవాది వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం..