CM Chandrababu Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన..!
- ఢిల్లీలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..
- ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం..
- మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటన ముగిసింది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం.. ఢిల్లీలో ఈ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తారని ముందుగా ప్రచారం జరిగింది.. ముఖ్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై.. ఏపీకి రావాల్సిన బకాయిలను విడదల చేయాలని కోరనున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రారంభంలో రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలను కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరే అవకాశం ఉందన్నారు.. మరోవైపు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ జాప్యానికి అడ్డుగా ఉన్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరతారనే ప్రచారం కూడా సాగింది..
Read Also: Rottela Panduga: నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు..
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
అయితే, హస్తినలో ఏపీ చంద్రబాబు.. ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు.. మరోవైపు.. ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో ( 1, జనపధ్) మరికాసేపట్లో పూజలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత విజయవాడ బయల్దేరనున్నారు.. కాగా, మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు.. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు.. పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!