Chandrababu Meets Amit Shah: అమిత్షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ..
- గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చ..
- పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. విభజన సమస్యలపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన తొలి రోజు పర్యటనలో హస్తిన చేరుకోగానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు… పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..
Read Also: Oil Tanker Capsized : ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..13 మంది భారతీయులు గల్లంతు
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం పై దృష్టిపెట్టారు.. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంట పాటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కేంద్రం వెంటనే పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తుంది.. మరోపక్క హైదరాబాదులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన విషయాలను సైతం చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించినట్లు సమాచారం.. ఇక, ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆర్థిక పరిస్థితులపై కూడా కేంద్ర హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు సమాచారం చర్చించినట్లు సమాచారం.. మరోపక్క పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడుకి ఇది రెండో ఢిల్లీ పర్యటన.. ముఖ్యంగా ఈనెల 22 నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరగాల్సిన కేటాయింపులపై మరోసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు నాయుడు ఈ టూర్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!