Chandrababu Meets Amit Shah: అమిత్షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ..
- గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చ..
- పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. విభజన సమస్యలపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన తొలి రోజు పర్యటనలో హస్తిన చేరుకోగానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు… పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..
Read Also: Oil Tanker Capsized : ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..13 మంది భారతీయులు గల్లంతు
Also Read
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం పై దృష్టిపెట్టారు.. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంట పాటు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కేంద్రం వెంటనే పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తుంది.. మరోపక్క హైదరాబాదులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన విషయాలను సైతం చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించినట్లు సమాచారం.. ఇక, ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆర్థిక పరిస్థితులపై కూడా కేంద్ర హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు సమాచారం చర్చించినట్లు సమాచారం.. మరోపక్క పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడుకి ఇది రెండో ఢిల్లీ పర్యటన.. ముఖ్యంగా ఈనెల 22 నుంచి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరగాల్సిన కేటాయింపులపై మరోసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు నాయుడు ఈ టూర్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?