దేశీయ మార్కెట్ను యుద్ధ భయం వెంటాడుతోంది. గురువారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడి కొనసాగిస్తోంది. త్వరలో పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం కాస్త మార్కెట్ పుంజుకుంది. అదే జోష్ కొనసాగుతుందని అంతా భావిచారు కానీ.. బుధవారం మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయింది. మరోసారి చమురు ధరలు పెరగడంతో గురువారం మార్కెట్ అల్లకల్లోలం అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 816 పాయింట్లు నష్టపోయి 76,047 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 23,625 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్!
నిఫ్టీలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో అత్యధికంగా నష్టపోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. ఆటో, మీడియా, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒక్కొక్కటి 2 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం తగ్గాయి.
ఇది కూడా చదవండి: War Effect: చెన్నైలో వదంతులు.. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు
ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు, నిరంతర ఎఫ్ఐఐ అమ్మకాల మధ్య భారత షేర్ మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. హార్ముజ్ జలసంధి, ఇరాకీ జలాల్లో అదనపు నౌకలు ఢీకొన్నాయని వచ్చిన నివేదికల తర్వాత చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం సరఫరా అంతరాయాల భయాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?