Budget 2024: ఈ బడ్జెట్ లో రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేనా..?
- రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం
- సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఊరట లభించేనా..?
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటువంటి పరిస్థితిలో.. ఈ సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రైలు టిక్కెట్లపై వారికి ఇచ్చిన 50 శాతం రాయితీని పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రైలు టిక్కెట్లపై సీనియర్ పురుష సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై 40 శాతం వరకు రాయితీని పొందేవారు. మహిళా సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఉండేది. 2019 చివరి వరకు.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఛార్జీల రాయితీలను అందించింది. రాజధాని రైలులో మొదటి ఏసీ టికెట్ ధర రూ. 4,000 అయితే.. సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రూ.2,000 లేదా రూ. 2,300 మాత్రమే లభించేది.
READ MORE: Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
2019 చివరి నుంచి కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. రైలు సేవలు నిలిచిపోయాయి. తరువాత వాటిని పునరుద్ధరించారు. కానీ తక్కువ ప్రయాణీకుల ప్రయాణం కారణంగా.. రైల్వే భారీ నష్టాలను చవిచూసింది. దీంతో రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్లకు భారత రైల్వే రాయితీని నిలిపేసింది. కొవిడ్ పరిస్థితిలో నష్టాల కారణంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే శాఖ మళ్లీ రాయితీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు ఎలాగైనా రాయితీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!