Budget 2024: ఈ బడ్జెట్ లో రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేనా..?
- రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం
- సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఊరట లభించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటువంటి పరిస్థితిలో.. ఈ సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రైలు టిక్కెట్లపై వారికి ఇచ్చిన 50 శాతం రాయితీని పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రైలు టిక్కెట్లపై సీనియర్ పురుష సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై 40 శాతం వరకు రాయితీని పొందేవారు. మహిళా సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఉండేది. 2019 చివరి వరకు.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఛార్జీల రాయితీలను అందించింది. రాజధాని రైలులో మొదటి ఏసీ టికెట్ ధర రూ. 4,000 అయితే.. సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రూ.2,000 లేదా రూ. 2,300 మాత్రమే లభించేది.
READ MORE: Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
2019 చివరి నుంచి కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. రైలు సేవలు నిలిచిపోయాయి. తరువాత వాటిని పునరుద్ధరించారు. కానీ తక్కువ ప్రయాణీకుల ప్రయాణం కారణంగా.. రైల్వే భారీ నష్టాలను చవిచూసింది. దీంతో రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్లకు భారత రైల్వే రాయితీని నిలిపేసింది. కొవిడ్ పరిస్థితిలో నష్టాల కారణంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే శాఖ మళ్లీ రాయితీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు ఎలాగైనా రాయితీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!