Kidney Sale Racket: “కిడ్నీ సేల్ రాకెట్”ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు.. ఐదు రాష్ట్రాల్లో ముఠా వ్యాపారం..
- కిడ్నీ సేల్ రాకెట్ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు..
- నిరుపేద బంగ్లాదేశీయుల నుంచి కిడ్నీలు సేకరించి లక్షల్లో అమ్మకం..
- ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షలు..
- 5 రాష్ట్రాల్లో ముఠాకు సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో ఈ రాకెట్ పనిచేస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు బంగ్లాదేశీయులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాపులు, సిమ్ కార్డులు, నగదు, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్కి చెందిన నిరుపేదల్ని ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని వ్యాపారం నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. వారి కిడ్నీలకు రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ముఠా విక్రయిస్తున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో బాధితులకు ఉద్యోగాలను ఎరగా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అవయవాలు అందుకున్న వారికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారు. ఈ కిడ్నీలు అవయవాలు అవసరమున్న వ్యక్తులకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు విక్రయించినట్లుగా తేలింది.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
Read Also: Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
అరెస్టైన వారిలో నోయిడా ఆస్పత్రిలో 15 నుంచి 16 అక్రమ సర్జరీలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ విజయ కుమారి కూడా ఉన్నారు. ఢిల్లీలోని జలోలా విహార్లో బంగ్లాదేశ్కి చెందిన కొంతమంది అనుమానాస్పద కార్యక్రమాలపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రస్సెల్, రోకాన్, సుమోన్ మియాన్, రతేష్ పాల్ అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. డాక్టర్ విజయ కుమారి అనే వ్యక్తి ఒక్కో సర్జరీకి రూ. 2 లక్షలు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
మూత్రపిండాల మార్పిడి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు చివరి దశలో అందించే వైద్య ప్రక్రియ. దగ్గరి బంధువుల నుంచి రోగికి కిడ్నీలు దానం చేయవచ్చు. సంబంధం లేని దాతల ద్వారా కిడ్నీ దానం చేయడానికి అధికార కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న దాతల సంఖ్య కంటే మార్పిడి అవసరమయ్యే రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో, చాలామంది కిడ్నీని పొందేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కిడ్నీ అనేది కొన్ని ముఠాలకు వ్యాపారంగా మారింది.
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!