Kidney Sale Racket: “కిడ్నీ సేల్ రాకెట్”ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు.. ఐదు రాష్ట్రాల్లో ముఠా వ్యాపారం..
- కిడ్నీ సేల్ రాకెట్ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు..
- నిరుపేద బంగ్లాదేశీయుల నుంచి కిడ్నీలు సేకరించి లక్షల్లో అమ్మకం..
- ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షలు..
- 5 రాష్ట్రాల్లో ముఠాకు సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో ఈ రాకెట్ పనిచేస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు బంగ్లాదేశీయులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాపులు, సిమ్ కార్డులు, నగదు, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్కి చెందిన నిరుపేదల్ని ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని వ్యాపారం నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. వారి కిడ్నీలకు రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ముఠా విక్రయిస్తున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో బాధితులకు ఉద్యోగాలను ఎరగా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అవయవాలు అందుకున్న వారికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారు. ఈ కిడ్నీలు అవయవాలు అవసరమున్న వ్యక్తులకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు విక్రయించినట్లుగా తేలింది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
అరెస్టైన వారిలో నోయిడా ఆస్పత్రిలో 15 నుంచి 16 అక్రమ సర్జరీలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ విజయ కుమారి కూడా ఉన్నారు. ఢిల్లీలోని జలోలా విహార్లో బంగ్లాదేశ్కి చెందిన కొంతమంది అనుమానాస్పద కార్యక్రమాలపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రస్సెల్, రోకాన్, సుమోన్ మియాన్, రతేష్ పాల్ అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. డాక్టర్ విజయ కుమారి అనే వ్యక్తి ఒక్కో సర్జరీకి రూ. 2 లక్షలు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
మూత్రపిండాల మార్పిడి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు చివరి దశలో అందించే వైద్య ప్రక్రియ. దగ్గరి బంధువుల నుంచి రోగికి కిడ్నీలు దానం చేయవచ్చు. సంబంధం లేని దాతల ద్వారా కిడ్నీ దానం చేయడానికి అధికార కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న దాతల సంఖ్య కంటే మార్పిడి అవసరమయ్యే రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో, చాలామంది కిడ్నీని పొందేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కిడ్నీ అనేది కొన్ని ముఠాలకు వ్యాపారంగా మారింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!