Air India: ఎయిరిండియా విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. ఎందుకో తెలుసా..?
- ఎయిరిండియా విమానంలో ఆర్మ్రెస్ట్ కోసం కొట్టుకున్న ప్రయాణికులు..
- ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న ఇద్దరు ప్రయాణికులు..
- ఇద్దరు ప్రయాణికుల సమస్యను పరిష్కరించినట్లు తెలిపిన ఎయిర్ ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్వాదం జరిగింది. ఇక, విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటును ఇచ్చారు.
Read Also: Salaar1 : సలార్ థియేటర్స్ లో సరిగా ఆడలేదు : ప్రశాంత్ నీల్
Also Read
అయితే, ఆదివారం (డిసెంబర్22) ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన కాసేపటికి వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ తీసుకునేందుకు తన పాత సీటు దగ్గరకు మళ్లీ వచ్చాడు. అప్పుడు ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం ప్రారంభమైంది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు పోయింది. విమానయాన సిబ్బంది వారిని నిలువరించడంతో.. ఈ గొడవ చివరకు ఆగిపోయింది. వారు ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!