Lok Sabha: వాయిదాలు.. ఆందోళనలకు 65 గంటలు వృథా
- వాయిదాలు.. ఆందోళనలకు 70 గంటలు వృథా
- నిమిషానికి రూ. 2.5 లక్షలకు మించి ఖర్చు
- రూ.97.87 కోట్లకు పైగా నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం తీరు కారణంగానే సమయం వృథా అయిందని తెలిపారు. నిరసనలు, ఆందోళనలతో సమయం గడిచిపోయిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి అదానీ లంచాల వ్యవహారంపై కాంగ్రెస్ పోరాటం చేసింది. అదానీపై విచారణ జరపాలంటూ నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొని వాయిదాలు పడిపోయాయి. ఇక రాజ్యసభలో కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్ పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో లాభం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో అంబేద్కర్ను అవమానించారంటూ బర్త్రఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గురువారం ఎంపీల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇక శుక్రవారం అర్థాంతరంగా ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిపోయాయి.
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
ఇలా పార్లమెంట్ సమావేశాలు వాయిదాలు.. ఆందోళనలతో సమయం వృథా అయిపోయింది. అధికారిక సమాచారం ప్రకారం లోక్సభ మొదటి సెషన్లో 5 గంటల 37 నిమిషాలు వృథా కాగా.. రెండవ సెషన్లో గంటా 53 నిమిషాలు, ముగింపు సెషన్లో ఆశ్చర్యకరంగా 65 గంటల 15 నిమిషాలు లోక్సభ కోల్పోయింది. ఇలా మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం వృథా అయిపోయింది. లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.97.87 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలకు మించి ఖర్చు చేయడంతో ఆర్థికపరమైన చిక్కులు గణనీయంగా పెరిగాయి.
#WinterSession #WinterSession2024 #Parliament #LokSabha #18thloksabhasession pic.twitter.com/7ZDKCR6MzZ
— LOK SABHA (@LokSabhaSectt) December 20, 2024
#WATCH | Delhi | On the Winter session of Parliament, Union Parliamentary Affairs Minister, Kiren Rijiju says, "In this session of Parliament, there were 20 sittings of Lok Sabha and 19 sittings of Rajya Sabha in 26 days. 4 and 3 bills were passed in Lok Sabha and Rajya Sabha,… https://t.co/C6jKFd7cdZ
— ANI (@ANI) December 20, 2024
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..