LK Advani: ఎల్కే. అద్వానీ హెల్త్ అప్డేట్ విడుదల!
- ఎల్కే. అద్వానీ హెల్త్ అప్డేట్ విడుదల!
- క్రమక్రమంగా కోలుకుంటున్నారన్న వైద్యులు
- త్వరలో ఐసీయూ నుంచి షిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 12న ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అద్వానీ చేరారు. అనారోగ్యం కారణంగా ఐసీయూలో ఉంచినట్లు డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. వినిత్ సూరి సంరక్షణలో అద్వానీ కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం క్రమంగా కుదిటపడుతోందని.. త్వరలోనే నార్మల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ఈ ఏడాది ఆగస్టులో అద్వానీ సాధారణ వైద్య పరీక్షల కోసం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. అలాగే జూలై 3న కూడా ఆసుపత్రిలో చేరి కొద్దిసేపు ఉండి డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఎయిమ్స్లో చేరారు. రాత్రి పూట టెస్ట్లు చేయించుకుని వెళ్లిపోయారు.
అద్వానీకి ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. నవంబర్ 8, 1927న పాకిస్థాన్లోని కరాచీలో ఎల్కే అద్వానీ జన్మించారు. 1980లో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం సాగింది. హోంమంత్రి, ఉప ప్రధానమంత్రితో సహా ముఖ్యమైన పాత్రలను నిర్వహించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో (1977-79) సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా చేశారు. 1980ల చివరలో రామజన్మభూమి ఉద్యమానికి అద్వానీ నాయకత్వం వహించారు. భారత హోం మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ జాతీయ భద్రతా వ్యవస్థలో అత్యంత సమగ్రమైన సంస్కరణలను తీసుకొచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనుకూలమైన మరియు రాజీలేని విధానాన్ని తీసుకొచ్చారు. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడానికి చిత్తశుద్ధితో పాటు స్థిరమైన ప్రయత్నాలు చేశారు.
ఇది కూడా చదవండి: Health Benefits: ఈ పండు అమృతం.. చలికాలంలో తిన్నారంటే రోగాలు మటుమాయం
తాజావార్తలు
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
-
NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!