పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లో లైక్లు మరియు వ్యాఖ్యలపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యకు దారితీసింది. సోషల్ మీడియాలో మహిళలో వివాదం కారణంగా ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలోని ముకుంద్ పూర్ పార్ట్ 2లో తనను కలవాలని ఇద్దరు యువకులను మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ను ఉద్దేశించి కొన్ని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. తన భార్య కూడా మీలా తిట్టలేదంటూ ట్విట్ చేశారు.
దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసిన విషయం తెలసిందే.. ఇక, ఈ తీర్మానం కాపీని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు బీఆర్ఎస్ నేతలు… తెలంగాణ సీఎం ఇప్పటికే అనేకమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది..…
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.…
గత నెలలో బంధువుతో సహా ముగ్గురు స్నేహితులచే లైంగిక వేధింపులకు, క్రూరత్వానికి గురైన 10 ఏళ్ల ఢిల్లీ బాలుడు ఢిల్లీ ప్రభుత్వ లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి(ఎల్ఎన్జేపీ)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
భారత టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ... దీంతో పాటు 5జీ సేవలకు కూడా శ్రీకారం చుట్టారు.
భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య వంట సిలిండర్ల ధరను రూ.25.50 తగ్గించాయి. ఈ తాజా సవరణతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,885కి బదులుగా రూ.1,859కే రానుంది.