Hot Topic Fog: దేశంలో ఇప్పుడు ఏం నడుస్తోందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు నలుగురు కలిస్తే ఏం నడుస్తోంది? అనేవారు. అప్పుడంతా జనం FOG నడుస్తోంది అనేవారు. అప్పుడదే పెద్ద హాట్ టాపిక్ అయ్యేది. తాజాగా దేశమంతా కూడా FOG నడుస్తోంది. నిజంగానే పొగమంచు (FOG) కమ్ముకుంటోంది. దీంతో ఎవరిని అడిగినా ఫాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. Fragrance కోసం యూత్ ఎక్కువగా ఫాగ్ వాడేవారు. ఇప్పుడు అసలే చలికాలం.. ఒకవైపు వణికించే చలి.. మరోవైపు కమ్ముకున్న పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటాం. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఆధారపడి వుంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. రహదారుల నిండా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగమంచు నిండుకోవడంతో ప్రధాన రహదారుల వెంబడి వెళ్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు గ్రామాల్లో ఒక మోస్తరు మంచు ఏర్పడినా పంట పొలాల్లో ఉన్న ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఏపీలోని అరకు, తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఉదయం విధులకు హాజరయ్యే వారు, రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుగా పరిగణించాలంటే, తేమ స్థాయి 70శాతం కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే శీతాకాలంలో తేమ తక్కువగా వున్నా పొగ కమ్ముకుంటుంది. శీతాకాలంలో ఏర్పడే పొగమంచు కారణంగా, హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా దారి తెలీదు. దీంతో అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒక్కోసారి పొగమంచు వల్ల విమానాలు రద్దవుతుంటాయి.

పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది. అసలే కాలుష్యం దీనికి తోడు పొగమంచు ప్రభావం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పొగమంచు ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమిపై రాత్రిళ్ళు వేడి వుంటుంది. గాలిలోని నీటి ఆవిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము. రహదారులు పొరలాగా కనిపిస్తాయి. అవతలి వ్యక్తి లేదా వాహనాలు సరిగా కనిపించవు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం వుంటుంది. విమానాలకు ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఆకాశంలో వెళ్లే ఇతర విమానాలు వాటికి కనిపించవు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పొగమంచు వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు.

ఏం నడుస్తోంది? FOG Uncle
తాజావార్తలు
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!