Delhi: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం.. ఆఫీసుకు తాళం వేయాల్సిందిగా ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Lt Governor Acts Against Official Amid Row With AAP: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా ఎల్జీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఓ ఉన్నతాధికారి కార్యాలయాని తాళం వేయాల్సిందిగా ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలోని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్(డీడీసీ) వైస్ చైర్పర్సన్ జాస్మిన్ షా తన కార్యాలయాన్ని ఉపయోగించకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని.. గత సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం జాస్మిన్ షా తన అధికారిక వాహనాన్ని, సిబ్బందితో సహా అన్ని ఇతర సౌకర్యాలను, అధికారాలను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు జాస్మిన్ షాను తొలగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వీకే సక్సేనా కోరినట్లు సమాచారం. ఈ పదవికి ఢిల్లీ ప్రభుత్వం మంత్రి హోదాను ఇచ్చింది.
Also Read
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
Read Also: GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు
జాస్మిన్ షా తన కార్యాలయాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేశారంటూ.. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన ఫిర్యాదు మేరకు నెల రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీడీసీడీ వైస్-ఛైర్పర్సన్గా పనిచేస్తున్నప్పుడు, జాస్మిన్ షా రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారని పర్వేష్ వర్మ ఆరోపించాడు. అయితే నోటిసులు అందుకు జాస్మిన్ షా.. డీడీసీడీ పై లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికార పరిధి లేదని.. ఇది క్యాబినెట్ నియమించిన మంత్రి స్థాయి పదవి అంటూ సమాధానం ఇచ్చారు. జాస్మిన్ షాకు సీఎం కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఢిల్లీ మద్యం స్కామ్ తరువాత లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!