ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి గోడలో కొంత భాగం కూలిపోయి, ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు
నాగ్పూర్ విమానాశ్రయం నుంచి రూ. 24 కోట్ల విలువైన 3.07 కిలోల యాంఫెటమైన్-రకం మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు ఢిల్లీకి చెందిన నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.DRI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారుల బృందం నిర్దిష్ట నిఘా ఆధారంగా ఉచ్చు వేసి, ఆగస్టు 20న నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 43 ఏళ్ల భారతీయుడిని అడ్డగించింది. అతను కెన్యాలోని నైరోబీ…
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. వావి వరుసలు కూడా మర్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. తండ్రికి ఫ్రెండ్ కదా అని నమ్మింది.. చివరికి దారుణంగా మోసపోయింది.. అమ్మాయి తల్లీ ఫిర్యాదు చెయ్యడంతో ఈ విషయం బయటకు వచ్చింది.. తమ కామావాంఛ తీర్చుకోవడానికి.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా.. వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు.…
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు.…
స్పైస్జెట్ ఫ్లైట్ ప్యాసింజర్ విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తే, కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణికులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.