Crime: ఉద్యోగం చేయొద్దని భార్య చేయి నరికిన సీఆర్పీఎఫ్ జవాన్
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు.
Read Also: Blind Cricket: వరల్డ్ ఛాంపియన్గా పాక్.. ఫైనల్లో టీమిండియా ఓటమి
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ కు చెందిన సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తన భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేదు.. అయినా ఆమె ప్రతీ రోజు డ్యూటీకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ఆదర్శ్ నగర్ లోని ఓ చిన్న హోటల్ లో వీరిద్దరు ఓ అద్దె గదిని తీసుకున్నారు. ఇక, వారి మధ్య ఉద్యోగం విషయంలో గొడవ స్టార్ట్ అయింది. కొంత సమయం తరువాత ఆ గొడవ సద్దుమణిగింది.. దీంతో హోటల్ సిబ్బంది ద్వారా ఈ జంట భోజనం తెప్పించుకున్నారు.. అయితే, సతీష్ కుమార్.. భార్యకు తెలియకుండా అందులో మత్తు మందు కలిపాడు. అది తిన్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను మంచానికి కట్టేసి అరచేయి నరికాడు.
Read Also: Astrology: ఆగస్టు 27, ఆదివారం దినఫలాలు
అనంతరం అక్కడి నుంచి సతీష్ కుమార్ పారిపోయాడు. ఈ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది.. లేచి చూసి తన పరిస్థితి అర్థం చేసుకుని.. గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బాధితురాలిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు గంటల తరబడి ఆపరేషన్ చేసి, ఆమె చేతిని తిరిగి అతికించారు.
Read Also: Gold Price Today: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే..!
ఈ ఘటపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీప్యూటీ పోలీస్ కమిషనర్ జితేంద్ర కుమార్ మీనా పేర్కొన్నారు. కాగా.. నిందితుడు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడి విషయంలో అతడితో పాటు సోదరుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని యూపీ పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!