LBnagar PS Incident: ఢిల్లీకి చేరిన ఎల్బీనగర్ పీఎస్లో మహిళపై దాడి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు విషయం ఢిల్లీకి చేరింది. ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
Kantara – 2: వామ్మో.. అంత బడ్జెటా..రిషబ్ అందుకే ఇలా చేస్తున్నాడా?
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఈ ఘటనపై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. హైకోర్టు సుమోటాగా కేసు విచారణకు తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను కాపాడేందుకు ఏ ‘షీ’ టీమ్ లేదని ఆరోపించారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ లో ఆరోజు ఉన్న పోలీసులందరిని డిస్మస్ చేయాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా పోలీసులను సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులపై జరిగే హత్యాచారాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టు పట్టిన సర్కార్ అని మండిపడ్డారు.
Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటి వరకు కవిత స్పందించలేదని రవీంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్ట ఎక్కడ ఉంది. 33 శాతం రిజర్వేషన్ అడిగిన కవిత ఎక్కడా అని కామెంట్ చేశారు. కూతురు పై కేసులు పెడితే కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి న్యాయవాదిని పెట్టుకుంటారు.. కానీ గిరిజన మహిళ పై దాడి జరిగితే స్పందించరా రవీంద్ర నాయక్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!