Body Found In Drum: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఓ నీలి రంగు డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో కలకలం సృష్టించిన పార్సిల్లో డెడ్బాడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాగి తులసి వచ్చిన పార్సిల్లోని మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరంకు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాగి తులసి చెల్లెలి భర్త సుధీర్ వర్మనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్ వర్మ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్,…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు…
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి…
Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
Sangareddy Crime: ఆస్తి కోసం ఐదు రోజులు ఆస్పత్రిలోనే శవం ఘటన సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట (మం) తంగేడుపల్లిలో సంచలనం సృష్టించింది. ఆస్తి ఇచ్చేంత వరకు భర్త అంత్య క్రియలు జరిపేది లేదని తేల్చి చెప్పింది.
సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే, తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా,…
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురిలో ఉన్న ఓ అనాధ మృత దేహాన్ని ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాయం చేసేందుకు మార్చురీ అసిస్టెంట్ ప్రయత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన మహిళా ఉద్యోగి.. అతన్ని అడ్డుకోవడంతో మృతదేహం తరలింపు నిలిచిపోయింది. అనాధ మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అమ్మడానికి తీసుకువెళుతున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో విషయాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచారు.
యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.