Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త
- యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన
- భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హత్య
- హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను చంపిన భర్త
- శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి పార్ట్స్ పలు ప్రాంతాల్లో పడేసిన నిందితుడు
- ఆగస్టు 6న ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది. అయితే.. అజబ్నగర్ కమరిహ్వాకు వెళ్లే దారిలో రెండు బస్తాల్లో మృతదేహం ముక్కలు కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్, ఇనుప రంపం, ఛాపర్, హెక్సా బ్లేడ్, ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.
ఆగష్టు 6వ తేదీన మృతదేహం యొక్క అవశేషాలను రోడ్డు పక్కన రెండు బస్తాలలో కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. వారు అక్కడికి చేరుకుని తెరిచి చూడగా అందులో శరీరం ముక్కలు కనిపించాయి. పోస్ట్మార్టం నివేదిక అనంతరం.. ఒక మహిళ మృతదేహంగా నిర్ధారించారు. ఈ క్రమంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ హత్య ఘటనను చేధించేందుకు పలు టీంలు రంగంలోకి దిగాయి. కాగా.. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మహిళను గుర్తించలేకపోయారు. 15 జిల్లాల్లో నమోదైన సుమారు 500 మంది తప్పిపోయిన మహిళల మిస్సింగ్ పై దర్యాప్తు చేపట్టారు.
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Nuziveedu: నూజివీడులో పెద్ద చెరువుకు గండి.. జలదిగ్బంధంలో 50 ఇళ్లు
ఘటనా స్థలానికి సమీపంలోని అగర్వా కూడలిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆగస్ట్ 6వ తేదీ ఉదయం బైక్పై ఓ అనుమానాస్పద వ్యక్తి తెల్లటి బస్తాను తీసుకుని సంఘటన స్థలం వైపు వెళ్తున్నట్లు కనబడింది. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి బైక్ నంబర్ కూడా లభ్యమైంది. ఆ బైక్ 260 రాణి బజార్, బద్గావ్ కొత్వాలి గొండా నివాసి రాధేశ్యామ్ గుప్తా కుమారుడు శంకర్ దయాల్ గుప్తా పేరిట రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా తాళం వేసి ఉండడం కనిపించింది. వాహనం యజమాని తన భార్య, కుమారుడితో కలిసి ఇంట్లో నివాసముండే వారని స్థానికులు తెలిపారు. అయితే.. చాలా రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లుతోందని చెప్పారు.
Nani: ‘టైర్’ల గోల.. నన్ను వదిలేయండి ప్లీజ్!
మరోవైపు.. సెల్ఫోన్ నంబర్ దొరకడంతో నిఘా బృందం రంగంలోకి దిగింది. మంగళవారం పోలీసులు శంకర్ దయాళ్ గుప్తాను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రంపం, ఛాపర్, హెక్సా బ్లేడ్ (సా), ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్, బైక్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ దయాళ్ భార్య పేరు గుడియా పాండే పోలీసులు తెలిపారు. ఆమెకు 2023లో శంకర్ దయాళ్తో వివాహం జరిగింది. భార్యపై శంకర్ దయాళ్కు అనుమానాలు ఉన్నాయని.. ఈ క్రమంలో.. అతనికి, భార్యకు తరచూ గొడవలు జరిగేవని పోలీసులు పేర్కొన్నారు. జూలై 30వ తేదీన గుడియాను హత్య చేయాలని శంకర్ దయాళ్ ప్లాన్ చేశాడని.. ఆగస్టు 1న భార్య గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు చెప్పారు. బ్లేడ్లు, ఎలక్ట్రానిక్ కట్టర్లతో భార్య శరీరాన్ని మూడు భాగాలుగా కోశాడన్నారు. ఆగస్టు 6న బల్రాంపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు బస్తాలల్లో శరీర భాగాలు తీసుకొచ్చి పడేశాడని.. ఆగస్టు 7వ తేదీన ఓ గోనె సంచిని తీసుకుని అయోధ్యలోని సరయూ నది వంతెన కింద పడేశాడని.. అనంతరం నిందితుడు లక్నోకు పారిపోయాడని పోలీసులు చెప్పారు.
- Tags
- crime movie
- Cut
- Dead Body
- husband
- kill
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!