Dead Body in Parcel: పార్శిల్లో డెడ్బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
- యండగండిలో షాకింగ్ ఘటన
- పార్శిల్లో డెడ్బాడీ
- పార్శిల్లో ఒక ఉత్తరం కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి తులసికి శ్రీనివాసరాజుతో వివాహం కాగా.. నిడదవోలులో నివాసం ఉండేది. శ్రీనివాసరాజు అప్పులు చేసి పది సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో.. తులసి తిరిగి యండగండి గ్రామం వచ్చేసింది. ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో నివాసం ఉంటూ.. భీమవరం దుర్గ స్టిల్స్ లో ఉద్యోగం చేసుకుంటుంది. ఈమెకు ఒక కూతురు ఉంది. తులసికి యండగండి గ్రామం జగనన్న కాలనీలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా.. ఇల్లు నిర్మిస్తోంది.
Also Read
ప్రస్తుతం తులసి ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో పెయింట్ డబ్బాలు, టైల్స్ అందజేసింది. తులసి తల్లితండ్రులు యండగండిలో ఉండటంతో.. వారి అడ్రస్ కి సేవా సమితి ఇంటి సామాన్లు పంపిస్తోంది. విద్యుత్ సామగ్రి కొరకు తులసి మరోసారి ఆర్థిక సాయంకు దరఖాస్తు చేసుకుంది. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. అది చూసి తులసి సహా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉంది. రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అందులో రాసుంది. తులసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్లో సుమారు 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తి మృతదేహంను గురించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?