తెలంగాణలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాల పై ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీజిఓ, టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. సీనియారిటీ లిస్ట్ తయారు, ఉద్యోగుల కేటాయింపు పై చర్చ జరిగింది. రేపటి వరకు సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు సీఎస్. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కేటాయించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. భార్య భర్తలకు ఒకే దగ్గర…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ…
యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంట.. కల్లాలు, రోడ్లపై ఉన్న పంట కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారే నడిచింది.. ఇక, తాజాగా యాసంగిలో వరి పంట వేయొద్దంటూ కేంద్రం కూడా స్పష్టంగా చెప్పేసింది.. దీంతో.. యాసంగిలో వరి పంట వేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖ అధికారులతో…
సీఎం జగన్ అధ్యక్షతన తిరుపతిలో కాసెపట్లో సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న జగన్కు మంత్రులు, నేతలు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఈ సమావేశం కేంద్ర హోమంత్రి అమిషా నేతృత్వం జరుగనుంది. ఈ సమావేశంలో పలు పెండింగ్ అంశాల గురించి సీఏం జగన్ చర్చించనున్నారు. తెలంగాణ తరుపున హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్లు ఈ సమావేశానికి హజరవనున్నారు. ప్రారంభ ఉపన్యాసం…
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు…
కరోనా అయిపోయింది అనుకోవద్దు..అందరూ రెండు డోసులు తీసుకోవాలి.. కరోనా ప్రభావం ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని, ప్రభుత్వం మాత్రం సన్నద్దంగా ఉందన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇకపై ఆక్సిజన్ లోటు రాదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతోందన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో…
తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్..…
ఖాజాగుడాలో మెగా వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరగనుంది. ఎవరు ఎక్కువ సేపు వేయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసారు. ఇంతకాలంగా వ్యాక్సిన్ ఇస్తున్నాము… ఎక్కడా తీవ్ర అనారోగ్యాలకు ఎవరు గురి కాలేదు. ఖాజాగుడా ప్రాంతలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మైగ్రేషన్ సిబ్బంది ఎక్కువగా పని చేస్తుంటారు. మైగ్రేషన్ వర్కర్ లకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. 2.8 కోట్ల…
పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… హైదరాబాద్లో కుండపోత వర్షం కురవగా.. ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.. అయితే, తెలంగాణలో భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సీఎస్ సోమేష్కుమార్కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు.…