కరోనా అయిపోయింది అనుకోవద్దు..అందరూ రెండు డోసులు తీసుకోవాలి.. కరోనా ప్రభావం ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని, ప్రభుత్వం మాత్రం సన్నద్దంగా ఉందన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు.
ఇకపై ఆక్సిజన్ లోటు రాదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతోందన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో కోటి మంది కి వాక్సిన్ ఇవ్వడానికి 169 రోజులు పట్టింది. తరవాత కోటి వాక్సిన్ కోసం 81 రోజులు పట్టింది. 36 రోజుల్లో మరో కోటి వాక్సిన్ పూర్తి చేసి.. మొత్తం 3 కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తి చేశాం.
తెలంగాణ లో తీసుకున్న చర్యలు.. దేశం మొత్తం ఫాలో అవ్వాల్సి వచ్చిందన్నారు. సూపర్ స్పైడర్స్ కు వేగంగా వ్యాక్సిన్ ఇచ్చాం. అందుకే కరోనా ప్రభావం తగ్గింది. అయినా, కరోనా అయిపోయింది అనుకోవద్దని.. పౌరులంతా రెండు డోసులు తీసుకోవాలన్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు సీఎస్ సోమేష్ కుమార్.