శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందింది. వివరాల్లో వెళితే.. శంషాబాద్ పరిధిలోని తేజస్విని స్కానింగ్ సెంటర్కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌదరిగుడా గ్రామానికి చెందిన కవిత అనే మహిళ స్కానింగ్ కోసం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తేజస్విని స్కానింగ్ సెంటర్ సిబ్బంది కవితకు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం కవిత మృత్యవాత పడింది. దీంతో కవిత మృతికి తేజస్విని స్కానింగ్ సెంటర్…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలడుగు ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముఠాను పట్టుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో మేడికొండూరు పీఎస్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెందిన ఓ జంటపై 8 మంది ముఠా సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్తను కొట్టి అతడి ముందే భార్యను సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శామీర్పేట మండలం పొన్నాల చెరువులో ఆదివారం ఉదయం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ఆ యువతి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి యువతిని హత్య చేసి ఉంటారని.. అనంతరం బాడీని చెరువులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు ఘటనా స్థలానికి వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక…
కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి…
ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ వినే ఉంటాం .. చదివే ఉంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న క్రైమ్ ని మాత్రం ఎక్కడా విని ఉండం .. కనీసం చదివి కూడా ఉండం. అంతటి దారుణమైన క్రైమ్ కి పాల్పడ్డాడు ఒక టీచర్. ఈ దారుణ ఘటన జర్మనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలో స్టెఫాన్ ఆర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. అతను స్వలింగ సంపర్కుడు. దీంతో ఒక డేటింగ్ యాప్ ద్వారా…
సెల్ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టిన చంపిన ఘటన గండి మైసమ్మలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ అనే వ్యక్తి గండి మైసమ్మలోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు. అయితే చెఫ్ రమేశ్ సెల్ ఫోన్ దొంగలించాడని ఆ హోటల్ నిర్వాహకుడు రాకేశ్ అనే వ్యక్తి రమేశ్ను తీవ్రంగా చిదకబాదాడు. రాకేశ్తో పాటు అతడి తల్లి భాగ్యలక్ష్మి, స్నేహితులు రమేశ్ను కొట్టి చంపారు. అయితే ఇటీవల పోలీసులకు దుండిగల్లో గుర్తు తెలియని వ్యక్తి…
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి సూసైడ్ వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు రావడం… అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో తాజాగా మరో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ వన్టౌన్లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి…
సాధారణంగా ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. ఆ భయంతోనే కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు ఆ భయాలు వారి ప్రాణాలమీదకు తెస్తాయి. తాజాగా ఒక ఖైదీ.. అధికారులు తనను ఏమన్నా చేస్తారన్న భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఢిల్లీ తీహార్ జైల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలు నెం. 1 లో ఒక వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా వచ్చాడు. కొన్ని…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతూ కామ వాంఛ తీర్చుకోవడానికి సిద్దమైపోతున్నారు. వావివరుస విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళను కొంతమంది వ్యక్తులు భర్త, కుమారుడి ముందే అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి, భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా…
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్లో ఈ దారుణం జరిగింది. మహిళపై యాసిడ్ పోసి దుండగులు పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మహిళపై యాసిడ్ దాడి ఎందుకు…