అనంతరపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గుంతకల్లు-బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే కనీసం ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిన్న రాత్రి బ్రిడ్జిపై నుంచి నుంచి కిందకు ఓ కారు పడిపోయింది. వంతెనపై నుంచి సుమారు 30 అడుగుల కిందకు కారు పడిపోయింది. దీంతో వంతెన కింద్రి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జలసమాధి అయ్యాడు.…
ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించారు. ముసుగులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు బ్యాంకులోవారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో సదరు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగదును కూడా దోచుకెళ్లిన ఘటన ముంబాయిలోని దహిసర్ వెస్ట్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ…
శృంగారానికి వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులో వారికైనా కోరికలు ఉండడం సహజమే. 80 ఏళ్ళ వయస్సులోను ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొని సంతృప్తిపొందేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక 80 ఏళ్ల వ్యక్తి కూడా తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె సరే అనడంతో తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి తనకు శృంగారం వద్దని,…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని తనను హింసిస్తున్నాడని ఒక కొడుకు తల్లితో కలిసి తండ్రిని హతమార్చాడు. ఈ విషయం బయటికి తెలియకుండా తండ్రి శవాన్ని ఇంట్లోనే ఉంచారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాగ్పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తికి సునీత తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదర్శ్ అనే కొడుకు ఉన్నాడు. గత పది రోజుల నుంచి కమలేష్…
ఢిల్లీ ఎయిర్పోర్టులో మరోసారి కోకైన్ పట్టుబడటం సంచలనంగా మారింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా నేరగాళ్లు మాత్రం డ్రగ్స్ సప్లయ్కు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా సిని ఫక్కీలో కోకైన్ ను తరలించే యత్నం చేసిన కిలాడి లేడిని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోకైన్ను చిన్న చిన్న క్యాప్సెల్స్లో నింపి కడుపులో దాచిన కిలాడిలేడీ ఆటలు కస్టమ్స్ అధికారుల వద్ద సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 91 క్యాప్…
తిరుపతి.. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ నగరంలో పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు తక్కువగా నమోదవుతుంటాయి. రాజకీయ దాడులు పక్కన పెడితే నేరాల సంఖ్య తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో దొంగతనాలు తిరుపతి వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఆగని చోరీలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని రూ.50వేల నగదు, 24గ్రాముల బంగారం…
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో దారుణం జరిగింది. జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. క్షణికవేశంలో మామను హత్య చేసాడు అల్లుడు. జగద్గిరిగుట్ట సంజయ గాంధీ నగర్ కు చెందిన రాజమౌళి (50) గత రాత్రి పాపి రెడ్డి నగర్ లో నివాసముండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్ళాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై చర్చించేందుకు వెళ్లగా మాట మాట పెరిగింది. ఇద్దరిమధ్య ఘర్షణచెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ విచక్షణ కోల్పోయాడు. తన…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులని కూడా చూడకుండా కామాంధులు చిదిమేస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నామన్న విచక్షణ మరిచి కామంతో రగిలిపోతూ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్, మైనర్ బాలికను వేధించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చిట్టమూరులో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక కుటుంబం తమ సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ కుటుంబం…
రోజురోజుకు సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. వయసుతో సంబంధం లేకుండా కామంతో రగిలిపోతున్న కామాంధులు ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక 10 వ తరగతి చదువుతోంది. నిత్యం స్కూల్ కి వెళ్లి వస్తుందే ఆమెకు మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు…
పార్ట్టైం జాబ్ అంటూ ‘లవ్ లైఫ్’ పేరుతో వేలాది మంది దగ్గర నుంచి సుమారు రూ.200 కోట్లు మోసం చేసిన ఘటనలో బాధితులు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లోనే కాక ఇలా రాష్ట్రవ్యాప్తంగా లవ్లైఫ్ యాప్ బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 18 లక్షలు కట్టినట్టు బెజవాడ సైబర్ పోలీసులకు ఓ బాధితుడు…