ఈమధ్యకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, కొంతమంది ప్రాణాలు పోతుండడం, బైక్ లు ధ్వంసం కావడంతో తనిఖీలు పెంచారు పోలీసులు. బంజారాహిల్స్ పార్క్ హయత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారు మందు బాబులు. రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసీ చూడనట్లు…
కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు. వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో…
రోజురోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అస్సలు వీరికి మానవత్వం ఉందా అనిపించక మానదు. అక్కాచెల్లి, తల్లితండ్రి ఇలాంటి సంబంధాలకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఒక అక్క.. తన స్వార్థం కోసం చెల్లిని బలిచేసింది. ప్రియుడి ఇచ్చే డబ్బు, ఫోన్ కి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికను ఒక మృగం చేతికి అప్పగించింది. ఆ కామాంధుడు బాలిక అని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి.. చావుబతుకుల్లో…
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్కాం…
విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు…
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే ముసలావిడ…
ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే…
దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్లోని కచ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లినా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి కొందరు దుండగులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. భుజ్ శివారులో జరిగిన ఈ ఘటన మార్చి 16న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని సమీపంలోని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సేన్ కాకల్…
హైదరాబాద్ లో ఓ వైద్యుడు హోటల్లో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న లాండ్ మార్క్ హోటల్ లో వైద్యుడి దుర్మరణం వివాదాస్పదం అవుతోంది. తన కుమార్తె వివాహ విషయమై నగరానికి వచ్చిన ఇండోర్ కు చెందిన వైద్యుడు పవన్ కుమార్ జైన్ (60) బసచేసిన ల్యాండ్ మార్క్ హోటల్లోని…
అవకాశాలు లేక, డబ్బుల కోసం పలువురు హీరోయిన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బుల కోసం వ్యభిచార కూపంలోకి చొరబడుతున్నారు. చివరికి ఇలా పోలీసుల చేతికి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా గోవాలో ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు…