Home
Crime News
Crime News News
-
Crime News: యాక్సిడెంట్లో ముగ్గురు మృతి, 3 గంటలపాటు రాస్తారోకో
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి… -
దారుణం.. చికిత్సలో భాగమని దాన్ని తొలగించిన వైద్యులు.. చివరికి
వైద్యులు అంటే దేవుడి తరువాత దేవుళ్ళు అంటారు.. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని చివరివరకు కాపాడేది వైద్యుడే. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఉంది కొందరు డబ్బు కోసం పాకులాడుతున్నారు. డబ్బు వస్తే చాలు మనిషి ఉన్నా పోయిన పట్టించుకోవడంలేదు. ఆపరేషన్ పేరుతో పేషంట్ పుర్రెను తొలగించి.. చివరకు అతికించకుండానే డిశ్చార్జ్ చేసిన ఘటన వరంగల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో… -
Terrorist Attack : ఉగ్రాదాడిలో టీవీ నటి మృతి..
ఉగ్రవాదుల తూటకు ఓ టీవీ నటి బలైంది. జమ్మూకాశ్మీర్లో బుధవారం రాత్రి మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అమ్రీన్ భట్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అమ్రీన్ భట్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు… -
Crime News: ఆమె రెండేళ్ళు పెద్దది.. పెళ్ళి కూడా అయింది.. చివరికి ప్రేమలో పడి!
అతడు.. ఆమె.. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ ఇద్దరు.. కలిసి చదువుకోవడమే కాదు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు కూడా! స్నేహితులుగానే మెలుగుతూ వచ్చిన ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలీదు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరన్న సంగతి గ్రహించి.. తాము ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నారు. అతడి కంటే ఆమె రెండేళ్ళు పెద్దది. అయినా, ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది? అయితే.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయికి… -
Crime News: యువతిని బలి తీసుకున్న ‘మొటిమలు’
పింపుల్స్.. యువతులకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఈ మొటిమలు తమ ముఖాన్ని అందవిహీనంగా తయారు చేస్తాయి కాబట్టి.. వీటి విషయంలో అమ్మాయిలు చాలా సీరియస్గా ఉంటారు. కొందరైతే, ఒక్క చిన్న మొటిమ వచ్చినా ఇంటి నుంచి బయటకు రారు. అయితే.. ఓ అమ్మాయికి ఎన్ని చికిత్సలు చేయించినా మొటిమలు పోకపోవడం, వాటి వల్ల పెళ్ళి కూడా అవ్వకపోవడంతో.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బిసంద పోలీస్… -
Crime Incident: పదిరోజులకోసారి ఇంటికి.. గదిలో కుళ్లిన శవం
పదిరోజులకోసారి ప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చే ఓ వివాహిత.. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితిలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్(35), గత ఆరు నెలల నుంచి ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కుక్గా పని చేసే ఇతని ఇంటికి.. శిరీష అనే మహిళ ప్రతి పదిరోజులకోసారి వచ్చి వెళ్తుండేది. ఈ… -
Self Destruction: రైల్వే ఉద్యోగి అఘాయిత్యం.. అది బయటపడిందని
కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు అగాథం సృష్టిస్తున్నాయి. అనుమానాలతో భార్యను భర్త, భర్తను భార్య వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడడం, లేదా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లి లో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ కి భార్య పిల్లలు వున్నారు. అయితే, భార్య ఉండగా ఓ యువతి తో వివాహేతర సంబంధం… -
Student Thrashed by Warder: విద్యార్థిపై విచక్షణ రహితంగా వార్డెన్ దాడి..
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిపై విచక్షణరహితంగా డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని, చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం చితకబాదాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్నుకుంటు పిడిగుద్దులు గుప్పించాడు నయీం. విద్యార్థి ఎంత ప్రాధేయ పడిన కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ విద్యార్థిని… -
Crime News: మరిది వేధింపులు.. వదిన ఆత్మహత్య
వదినమ్మ అంటే అమ్మ తరువాత అమ్మ. అలాంటి వదినమ్మకు నరకం చూపాడు ఓ మరిది. అతనికి సహకరించారు కుటుంబసభ్యులు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది ఆమహిళ. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వదిన కేసు తనపై వస్తుందని భావించిన మరిది శవాన్ని బావిలో నుంచి తీసి మూటకట్టి …సింగూర్ డ్యామ్ వేసి చేతులు దులుపుకున్నాడు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం అమ్రాదికలాన్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగమ్మని 28 సంవత్సరాల క్రితం ఆశయ్యతో… -
Sonu Sood: సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో టోకరా.. రూ.68వేలు దోపిడీ
కరోనా సమయంలో నటుడు సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో పేదలకు సహాయం అందించి రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి తాజాగా రూ.68 వేలు దోచుకోవడం హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) అనే మహిళ బంధువుల్లో ఒకరికి కేన్సర్ చికిత్స కోసం డబ్బు అవసరమైంది. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో…
తాజావార్తలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!