ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల…
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై…
ఈమధ్యకాలంలో చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు యువత. అదే మద్యం మత్తులో అయితే వారుచేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్లో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శనివారం అర్థరాత్రి 11…
బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్తో సహా మరో వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. అయితే.. ఆశిష్ గౌడ్ రూ. రెండున్నర కోట్ల రుణం తీసుకొని బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ బీజేపీ నేత కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 వ్యాపార కార్యకలపాల కోసం సోమాజిగూడలోని ఎస్బీఐ శాఖ నుంచి రుణం కోసం…
పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో వుండి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది టీచర్లు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో చిల్లగుండ్ల పల్లెలో సైకో ఉపాధ్యాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో టిచర్ గా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి,లైంగికంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు అబు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్రేప్ ఘటన మరువక ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి…
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది హైదరాబాద్లోని ప్రిజం పబ్. అయితే ఇప్పటికే పలు ఘటనల్లో ప్రిజం పబ్కు సంబంధం ఉంది. తాజాగా మరోసారి కస్టమర్పై దాడి చేసి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది. పబ్కు వచ్చిన నంద కిషోర్ అనే వ్యక్తిపై ప్రిజం పబ్ బౌన్సర్లుతో కలిసి యాజమాన్యం పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నందకిషోర్ ఎన్టీవోతో మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రిజం పబ్ కి వెళ్ళాను. అక్కడ నాన్ స్మోకింగ్ జోన్…
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ…
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్(35) గురువారం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనంపై తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తుండగా ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఒకరు తల్వార్.. మరొకరు గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చి అక్కడినించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రవినాయక్ మృతదేహాన్ని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. కాగా, హత్యకు పాల్పడ్డ ఇద్దరు అనుమానితులను…
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్…