Crime News: ఇంట్లో శవంగా మహిళ.. పెంచుకున్న పిల్లులే పీక్కుతిన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వార్త కూడా అలాంటిదే.
వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రోస్టోవ్ లో ఒక మహిళ(55) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆమె పిల్లులను పెంచుతోంది. ప్రస్తుతం ఆమె వద్ద 20 పిల్లులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా వాటి కోసం రాత్రి కల్లా ఇంటికి వచ్చేసేది. మూడు పూటలా వాటికి నచ్చిన ఆహారం వండి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఒక వారం క్రితం ఒక్కసారిగా ఆమె కుప్పకూలి పడిపోయింది. చూసేవాళ్లు లేరు.. అడిగేవాళ్లు అస్సలు లేరు. దీంతో ఆమె మృతి చెందింది అన్న విషయం కూడా బయట ఎవరికి తెలియదు. ఇలా వారం గడిచింది. ఇంట్లో ఉన్న 20 పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఇక ఆహరం లేక ఆ పిల్లులు ఇప్పటివరకు తమను సాకిన యజమాని అని కూడా లేకుండా ఆమెను పీక్కుతినడం మొదలుపెట్టాయి. అలా మహిళ శరీరాన్ని కొంచెం కొంచెం లాగుతూ చర్మాన్ని తింటూ కడుపు నింపుకున్నాయి. ఇక చివరికి వారం తరువాత ఇంటి పక్కన ఉన్నవారికి మహిళ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. పిల్లులు మహిళ శవంపై పడి పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లులు తినగా మిగిలిన బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!