Crime News: ఇంట్లో శవంగా మహిళ.. పెంచుకున్న పిల్లులే పీక్కుతిన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వార్త కూడా అలాంటిదే.
వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రోస్టోవ్ లో ఒక మహిళ(55) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆమె పిల్లులను పెంచుతోంది. ప్రస్తుతం ఆమె వద్ద 20 పిల్లులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా వాటి కోసం రాత్రి కల్లా ఇంటికి వచ్చేసేది. మూడు పూటలా వాటికి నచ్చిన ఆహారం వండి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఒక వారం క్రితం ఒక్కసారిగా ఆమె కుప్పకూలి పడిపోయింది. చూసేవాళ్లు లేరు.. అడిగేవాళ్లు అస్సలు లేరు. దీంతో ఆమె మృతి చెందింది అన్న విషయం కూడా బయట ఎవరికి తెలియదు. ఇలా వారం గడిచింది. ఇంట్లో ఉన్న 20 పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ఇక ఆహరం లేక ఆ పిల్లులు ఇప్పటివరకు తమను సాకిన యజమాని అని కూడా లేకుండా ఆమెను పీక్కుతినడం మొదలుపెట్టాయి. అలా మహిళ శరీరాన్ని కొంచెం కొంచెం లాగుతూ చర్మాన్ని తింటూ కడుపు నింపుకున్నాయి. ఇక చివరికి వారం తరువాత ఇంటి పక్కన ఉన్నవారికి మహిళ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. పిల్లులు మహిళ శవంపై పడి పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లులు తినగా మిగిలిన బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!