కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతనే యముడయ్యాడు. భర్త అంటే భరించేవాడు. కానీ ఆ భర్త ఆ ఇల్లాలి పాలిట కర్కోటకుడు అయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై లో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. అప్పుల భారం తట్టుకోలేక భార్య,ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపేశాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రకాష్. ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్లో కొనుగోలు చేశాడు ప్రకాష్. ముగ్గురిని చంపి తను…
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు…
హైదరాబాద్లో మరో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళను ప్రేమించమని వెంటపడి వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించడంతో పగ పెంచుకున్న ఆ ఉన్మాది ఒంటిరిగా వెళ్తున్న సదరు మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూరా భాను అనే వివాహిత మహిళను హబీబ్ అనే వ్యక్తి గత సంవత్సరకాలంగా ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో.. అతడి ప్రేమను…
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి…
వైద్యులు అంటే దేవుడి తరువాత దేవుళ్ళు అంటారు.. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని చివరివరకు కాపాడేది వైద్యుడే. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఉంది కొందరు డబ్బు కోసం పాకులాడుతున్నారు. డబ్బు వస్తే చాలు మనిషి ఉన్నా పోయిన పట్టించుకోవడంలేదు. ఆపరేషన్ పేరుతో పేషంట్ పుర్రెను తొలగించి.. చివరకు అతికించకుండానే డిశ్చార్జ్ చేసిన ఘటన వరంగల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో…
ఉగ్రవాదుల తూటకు ఓ టీవీ నటి బలైంది. జమ్మూకాశ్మీర్లో బుధవారం రాత్రి మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అమ్రీన్ భట్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అమ్రీన్ భట్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు…
అతడు.. ఆమె.. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ ఇద్దరు.. కలిసి చదువుకోవడమే కాదు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు కూడా! స్నేహితులుగానే మెలుగుతూ వచ్చిన ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలీదు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరన్న సంగతి గ్రహించి.. తాము ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నారు. అతడి కంటే ఆమె రెండేళ్ళు పెద్దది. అయినా, ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది? అయితే.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయికి…
పింపుల్స్.. యువతులకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఈ మొటిమలు తమ ముఖాన్ని అందవిహీనంగా తయారు చేస్తాయి కాబట్టి.. వీటి విషయంలో అమ్మాయిలు చాలా సీరియస్గా ఉంటారు. కొందరైతే, ఒక్క చిన్న మొటిమ వచ్చినా ఇంటి నుంచి బయటకు రారు. అయితే.. ఓ అమ్మాయికి ఎన్ని చికిత్సలు చేయించినా మొటిమలు పోకపోవడం, వాటి వల్ల పెళ్ళి కూడా అవ్వకపోవడంతో.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బిసంద పోలీస్…
పదిరోజులకోసారి ప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చే ఓ వివాహిత.. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితిలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్(35), గత ఆరు నెలల నుంచి ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కుక్గా పని చేసే ఇతని ఇంటికి.. శిరీష అనే మహిళ ప్రతి పదిరోజులకోసారి వచ్చి వెళ్తుండేది. ఈ…
కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు అగాథం సృష్టిస్తున్నాయి. అనుమానాలతో భార్యను భర్త, భర్తను భార్య వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడడం, లేదా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లి లో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ కి భార్య పిల్లలు వున్నారు. అయితే, భార్య ఉండగా ఓ యువతి తో వివాహేతర సంబంధం…