హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కి తరలించారు.…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్హౌస్లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్హౌస్లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. చైన్నైలోని తిరునల్వేలి పనకుడి పట్టణంలో ఓ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. అయితే వారికి తెలియక కారు డోర్ లాక్ చేశారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారని దగ్గరలోనే ఉన్న గుడిలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లారు నాగరాజన్ కుటుంబ సభ్యులు.. గుడికి వెళ్లొచ్చిన నాగరాజన్ కుటుంబ సభ్యులు పిల్లల గురించి చూశారు. అయితే ఎంత వెతికిన ఇంట్లో కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లోని కారులో చూడగా.. ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు.…
ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి…
మిస్ట్ కాల్ వస్తే దానిని కట్ చేయడం మానేసి.. అవతలి గొంతు హస్కీగా వుందని మీరు దానికి టెంప్ట్ అయితే అంతే సంగతులు. ఆ స్వరం మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. మహిళా గొంతుతో లక్షల్లో అక్రమ సంపాదనకు తెరతీశాడో ప్రబుద్ధుడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. ఆడ గొంతుతో మగాళ్లను బురిడీ కొట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు మిస్డ్ కాల్ చేయడం… వారితో ఆడ వారి లాగా మాట్లాడడం ఆర్థికంగా…
అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి.. వేసవి సెలవులు కదా అని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు అలా రావడమే ఆమె చేసిన తప్పని.. సమాజంలో తన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ అవకాశం రాగానే జింక మీద పులి పడ్డట్లు పడి నమిలి తినేసే కామాంధులు ఉంటారని చిన్నారికి తెలియదు.. తినడానికి అవి ఇస్తాను.. ఇవి ఇస్తాను అని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక క్రూర మృగం..…
మరికొన్ని రోజుల్లో ఆ యువకుడికి పెళ్ళి.. కుటుంబీకులందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.. అంగరంగ వైభవంగా పెళ్ళి నిర్వహించాలని రంగం సిద్ధం చేస్తున్నారు.. కానీ ఇంతలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఆ యువకుడ్ని బలి తీసుకుంది. పెళ్ళి పీటలు ఎక్కాల్సిన తమ అబ్బాయి.. పాడె ఎక్కాల్సి వచ్చిందంటూ కుటుంబీకులు భోరమంటూ విలపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం…
ఈమధ్య లోన్ యాప్స్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇచ్చేది గోరంతే అయినా, పెట్టే వేధింపులు మాత్రం కొండంత! ఈ లోన్ యాప్స్ వల్ల ఎందరో లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. తాజాగా మరో లోన్ యాప్ అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. తాను తీసుకున్న దానికంటే భారీ మొత్తం చెల్లించినా.. ఇంకా అప్పు తీరలేదంటూ ఓ మహిళను మానసికంగా వేధించడమే కాదు, ఆమె నగ్న ఫోటోను వైరల్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..…
రెండు వేలు.. కేవలం రెండు వేల రూపాయలు కనిపించలేదని నెలకొన్న గొడవలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడబోయి, తాను దారుణ హత్యకు గురైంది. కల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సరూర్నగర్లో రాములమ్మ (50) తన ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు), వారి అల్లుళ్ళ (నందు, రాజు)తో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్లో ఉంటోంది. రాములమ్మకు వరుసకు అన్న అయ్యే కే. రాజు సరూర్నగర్లో…
సాధారణంగా పెద్దవారు ఒక మాట చెప్తూ ఉంటారు.. మహిళ ఏదైనా తట్టుకుంటుందేమో కానీ తన భర్తను వేరొకరితో పంచుకోవడం మాత్రం తట్టుకోలేదని.. అయితే ఇది కొంత వరకు నిజమే.. తనకు మాత్రమే పంచాల్సిన ప్రేమను భర్త వేరొకరికి పంచుతుంటే భార్యకు కోపం రావడం సహజం.. అయితే ఆ కోపంలో ఎంత నీచానికైనా దిగజారడం నేరం. తాజాగా ఒక భార్య, తన భర్త వేరొక యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడింది. భర్త మాట్లాడుతున్న అమ్మాయిని ఇంటికి…