ఒక్క గ్యాంగ్ రేప్.. వందల మిస్టరీలు.. పోలీసులకు అంతుచిక్కని రీతిలో సినిమా సస్పెన్స్ మాదిరిగా గ్యాంగ్ రేప్ విచారణ కొనసాగుతోంది. ఆ గంటన్నర పాటు ఏం జరిగింది. గంటన్నరలో 5 గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. గంటన్నరలో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డులు మొత్తాo తిరిగి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.. పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు కూడా ఈ కేసులో…
విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్లో ఫుట్బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గల కారణాలను పోలీసులు తెలిపారు. పక్కా స్కెచ్తోనే ప్రభాకర్ గ్యాంగ్ హత్య చేసిందని విజయవాడ డీసీపీ జాషువా మీడియాకు వెల్లడించారు. ఆకాష్ మర్డర్ కేసులో 11 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వాంబే కాలనీలో రౌడీషీటర్ టోని అనే వ్యక్తి ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని అంత్యక్రియల సమయంలో ఆకాష్, ప్రభాకర్ గ్యాంగ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. టోని అంత్యక్రియల అనంతరం వీరంతా…
ఆన్లైన్ లోన్యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్వాహకులు జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. లోన్ యాప్ల ద్వారా రుణాలిచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అశ్లీల ఫొటోలు పంపి మరింత ఇబ్బందులకు గురిచేసే ఘటనలు పేట్రేగుతున్నాయి. తీసుకున్న రుణానికి ఒక్కోసారి రెండు నుంచి నాలుగు రెట్ల సొమ్మును వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల…
ఈనెల 4వ తేదీన ఘనంగా పెళ్ళి జరిగింది.. ఆ తర్వాత 5వ తారీఖున రిసెప్షన్ జోరుగా నిర్వహించారు.. ఈ రెండు రోజులూ వరుడు చాలా సంతోషంగా కనిపించాడు. కానీ.. ఆ తర్వాతి రోజు మాత్రం తన ఇంట్లోనే విగత జీవిగా మారాడు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి…
ఆమె ఓ వివాహిత.. తొలుత సరదా కోసం ఆన్లైన్ రమ్మీ ఆడటం మొదలుపెట్టింది.. తర్వాత అది అలవాటైంది.. అనంతరం ఆ ఆటకి బానిసైంది. ఎంతలా అంటే.. లక్షల్లో అప్పులు చేసింది. నగలు కూడా విక్రయించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆ భారం భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పని చేస్తోన్న భాగ్యరాజ్ కందన్.. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమించి…
హైదరాబాద్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమ్నీషియా పబ్ రేప్ కేసు మరవకముందే రెండు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానాకు చెందిన ఓ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ధీరజ్, రితేష్ అనే ఇద్దరు యువకులు…
వాడు భర్త కాదు.. నరరూప రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటి భార్యను హీటర్తో కొట్టి చంపాడు. ఆ కేసులో జైలుకెళ్లి, బెయిల్పై బయటకొచ్చాడు. అనంతరం మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్తో బాది చంపేశాడు. ఈ దారుణ ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడలోని ఓ మాల్లో పని చేసే సరోజ (21)కు…
ఆ యువతి ఓ అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. తనే సర్వస్వమని నిర్ణయించుకుంది. ఆ అబ్బాయి కూడా యువతిని ప్రేమించాడు. కానీ, పెళ్లి విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విశాఖపట్నం భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొయ్య లావణ్య (16) అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ యువతి అదే గ్రామంలో ఉండే మణికుమార్ని ప్రేమించింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరు.. పెళ్ళి…
భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఓ మహిళ.. శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప (28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు ముందునుంచే నిరూప తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా తమ మాట వినకుండా రాజశేఖర్ను పెళ్ళి…