Uttarakhand: కుటుంబసభ్యులను హత్యచేసిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు. తన భార్య, తల్లితో పాటు ముగ్గురు కూతుళ్లను గొంతు కోసం హత్య చేశాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పూజారి తన సొంత కుటుంబసభ్యులనే హత్య చేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
గత ఏడేళ్లుగా మహేష్ కుమార్ తివారీ డెహ్రాడూన్లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉదయం 7.30 గంటలకు జరిగింది. ఇంట్లో నుంచి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు తెలియజేయగా.. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డాడనేది ఇంకా తెలియలేదని డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ కమలేష్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మృతులను తల్లి బితాన్ దేవి (75), భార్య నీతూ దేవి (36), కుమార్తెలు అపర్ణ (13), అన్నపూర్ణ (9), స్వర్ణ (11)గా గుర్తించారు.
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!