ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా... వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజ మరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. కాగా, మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Snoring: బిగ్గరగా "గురక" పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది.
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్లోని ఎస్ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్…
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్)
Security Guard Stuck Lift: లిఫ్ట్ లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. కాళ్ళు బయట బాడీ లోపల ఇరుక్కు పోవడంతో గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.
Gutkha: గుట్కా ఒక యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. తన భార్య వేరే వ్యక్తి నుంచి గుట్కా తీసుకుందని, అసూయపడిన భర్త తన గొంతు, మణికట్టును కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ బేతల్ జిల్లాలో గౌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే మరికొన్ని కొన్ని గొడవలు మాత్రం ప్రాణాలను తీస్తున్నాయి.. ఇటీవల అలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. మటన్ తినే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. దాంతో మొదట మాటలతో మొదలైన గొడవ కాస్త కత్తితో పొడుచుకొని చనిపోయే వరకు వచ్చింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల…