AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయనుంది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదు కానున్నాయి. ఇప్పటివరకు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తులు, పరిశీలనలు, అనుమతుల ప్రక్రియ కారణంగా ఆలస్యం జరిగేది. కొత్త విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
వారసత్వ హక్కుల బదలాయింపులో పారదర్శకత పెంచడంతో పాటు, ప్రజలకు సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు ఆటోమేటిక్గా రెవెన్యూ వ్యవస్థలో అప్డేట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అలాగే రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములకు స్టాంప్ డ్యూటీని కేవలం రూ.100గా నిర్ణయించారు. దీని వల్ల చిన్న, మధ్య తరహా భూముల వారసులకు ఆర్థిక భారం తగ్గనుంది.
Also Read
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
- Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
- Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
వీలునామా (విల్) లేకుండా వారసత్వ భూముల బదలాయింపు జరిగే సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా అసలైన వారసులను గుర్తించే ప్రక్రియ సులభతరం కానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారసత్వ భూముల విషయంలో ఎదురయ్యే ఆలస్యాలు, అనవసరమైన కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం భూ పరిపాలనలో కీలక మార్పుగా అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Andhra Pradesh : మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
-
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!