AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయనుంది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదు కానున్నాయి. ఇప్పటివరకు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తులు, పరిశీలనలు, అనుమతుల ప్రక్రియ కారణంగా ఆలస్యం జరిగేది. కొత్త విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
వారసత్వ హక్కుల బదలాయింపులో పారదర్శకత పెంచడంతో పాటు, ప్రజలకు సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు ఆటోమేటిక్గా రెవెన్యూ వ్యవస్థలో అప్డేట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అలాగే రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములకు స్టాంప్ డ్యూటీని కేవలం రూ.100గా నిర్ణయించారు. దీని వల్ల చిన్న, మధ్య తరహా భూముల వారసులకు ఆర్థిక భారం తగ్గనుంది.
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
వీలునామా (విల్) లేకుండా వారసత్వ భూముల బదలాయింపు జరిగే సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా అసలైన వారసులను గుర్తించే ప్రక్రియ సులభతరం కానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారసత్వ భూముల విషయంలో ఎదురయ్యే ఆలస్యాలు, అనవసరమైన కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం భూ పరిపాలనలో కీలక మార్పుగా అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
-
BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
-
Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
-
ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: మోడీ ఉచిత కోచింగ్ ప్రకటనపై అనూహ్య స్పందన.. కోచింగ్ సెంటర్లు మద్దతు
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!