Crime News: అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు వివాహిత దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది.
Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గుడెపు యాదమ్మ గత నెల 27న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి రాళ్లగూడలోని బంధువుల ఇంటికి వెళుతునట్లు ఇంట్లో వాళ్ళకు చెప్పి వెళ్ళింది. అయితే అదేరోజు చీకటి పడిన అమె తిరిగి ఇంటికి రాలేదు. బంధువులకు ఫోన్ చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు.. ఆమె వాడిన ఫోన్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. యాదమ్మ చివరి ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడింది అనే విచారించగా సంఘిగూడ గ్రామానికి చెందిన శంకరయ్యగా తేలింది. అయితే ఈ నెల 5వ తేదీన శంకరయ్యను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. దీంతో శంకరయ్య యాదమ్మను పెద్దషాపూర్ బస్టాండ్ వద్ద బైక్ పై ఎక్కించుకుని సంఘిగూడలోని తన పొలానికి తీసుకెళ్ళానని చెప్పాడు. పొలం వద్దకు చేరుకున్న ఇద్దరికి అప్పటికే వివాహేతర సంబంధం ఉన్నట్లు అదే చనువుతో యాదమ్మ వద్ద శంకరయ్య 2.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే పొలం వద్ద ఇద్దరి మద్య డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి గురైన శంకరయ్య బండరాయితో అమె తలపై బలంగా కొట్టాడు. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే భయబ్రాంతులకు గురైన శంకరయ్య ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న జేసీబీ సహాయంతో పొలంలోనే గొయ్యి తవ్వి యాదమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్థానిక ఎమ్మార్వో నాగమణి సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!