దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడితో అతని ముగ్గురు స్నేహితులు బలవంతంగా బూట్లు నాకించి అనంతరం అతడితో "అసహజ సెక్స్" చేయించారు. నిందితులు తమ మొబైల్ ఫోన్లలో ఈ చర్యను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు.
విజయనగరం జిల్లా మహారాజుపేట గ్రామములో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది. హంతకుడు విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కుర్మారావుగా పోలీసులు వెల్లడించారు. హంతకుడు కూర్మారావు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు.
Nagpur: జైలు నుంచి పెరోల్పై వచ్చినా కూడా అతని బుద్ధి మారలేదు. ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగింది. ఒక హత్య కేసులో దోషిగా తేలిని వ్యక్తికి ఇటీవల పెరోల్ మంజూరైందని, ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్వాడ్లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Jaipur: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. రాజస్థాన్ జైపూర్కి చెందిన 16 ఏళ్ల బాలికపై మామ, అతని కొడుకు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా బాలికపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడుతున్నారని, బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం తెలిసిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె గర్భంతో ఉందని గుర్తించి, పిండాన్ని తొలగించడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఈ సంఘటన…
Karnataka: అత్యాచారానికి గురైన టీనేజ్ బాలిక, తాను గర్భం దాల్చాలని తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అని తెలియగానే ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్లో లైంగిక వేధింపులకు గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు బాలిక ఇంటి పొరుగున ఉండే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అమ్మని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్కి చెందిన సంజీవ్ కుమార్గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది.
Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.