Home
Crime News
Crime News News
-
Nagpur: “ఫోన్లో బిగ్గరగా మాట్లాడొద్దని చెప్పినందుకు”.. 28 ఏళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి..
Nagpur: మహారాష్ట్ర నాగ్పూర్లో దారుణం జరిగింది. ఫోన్లో గట్టిగా మాట్లాడోద్దని సూచించినందుకు ఏకంగా ఓ తండ్రి కొడుకును కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాడ్తో దాడి చేయడంతో అతని కొడుకు మరణించాడు. ఈ ఘటన నాగ్పూర్ జిల్లాలో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్రా గ్రామంలో జరిగింది. నిందితుడు రాంరావు కక్డేని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read:… -
Family Suicide Case: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ కేసులో పోలీసులు ఏమన్నారంటే?
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా... శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
Mobile Explosion: విషాదం.. మొబైల్ పేలి నలుగురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక(8), గోలు(6), కల్లు(5) తీవ్రగాయాల పాలయ్యారు. -
Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధింపు..
Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది.… -
Love Affair: 20 సెకన్ల వ్యవధిలో 10 సార్లు ప్రియురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య..
Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు. -
Suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసులపై బంధువుల ఆగ్రహం
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. -
Crime: ఉద్యోగం వెతుక్కోమని చెప్పినందుకు తండ్రిని హత్య చేసిన కొడుకు..
Crime: ఉద్యోగం చూసుకోవాలని తండ్రి కోరడమే పాపమైంది. కొడుకు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని నారిసింగ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం చూసుకోవాలని ఒత్తిడి చేయడంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న రాకేష్ ఠాకూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ కాలనీలో శవమై కనిపించాడు. అతని కొడుకు సుధాన్షు ఠాకూరు అతడిని హత్య చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు… -
Nellore Crime: ఘరానా దొంగలు.. కొట్టేసిన బంగారాన్ని ఏం చేశారో తెలిస్తే షాకవుతారు?
నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది. -
Bus Accident: విషాదం.. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!