ఐపీఎల్ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్లో మూడు స్థానాల గురించి క్లారిటీ రాగా.. మరో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ…
విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం…
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63, సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3…
పురుషుల ఐపీఎల్ తరహాలోనే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ను నిర్వహిస్తోంది. అయితే మహిళల ఐపీఎల్ కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ మేరకు తాజాగా బీసీసీఐ నాలుగో సీజన్ మహిళల టీ20 ఛాలెంజ్ షెడ్యూల్ను ప్రకటించింది. సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. మే 23న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది.…
ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించడంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు సైమండ్స్కు రోడ్డుప్రమాదం జరిగిన ప్రదేశంలోనే అతని సోదరి లూయిస్ ఓ భావోద్వేగ లేఖను రాసి ఉంచడం అందరినీ కలిచి వేస్తోంది. Read Also: Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి ‘చాలా త్వరగా అందనంత దూరంగా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి…
ఐపీఎల్ కారణంగా అలసిపోతున్న, గాయపడిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉంది. త్వరలో కీలక ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ ముగియగానే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్కు టీమిండియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్…
టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ఇటీవల వరుస పరాజయాలను చవిచూస్తోంది. చివరకు బలహీన జట్లపైనా ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. గత 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. టెస్ట్ జట్టుకు కొత్త కోచ్ను నియమించింది. ఈ మేరకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్కలమ్ను కోచ్గా అపాయింట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొద్దిరోజులుగా…
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 91పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో ఢిల్లీ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. వార్నర్ (19), శ్రీకర్ భరత్ (8), మిచెల్…
ఐపీఎల్లో శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ జాస్ బట్లర్(30) మంచి సహకారం అందించాడు.…