Team India: టీమిండియాకు అరుదైన రోజు.. చరిత్ర సృష్టించి నేటితో 39 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్లో అండర్ డాగ్గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్ సేన చరిత్ర సృష్టించింది. 39 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 25న టీమిండియా తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను సగర్వంగా కైవసం చేసుకుంది. దీంతో క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం మొదలైంది. జూన్ 25న క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బలమైన వెస్టిండీస్ జట్టును ఏకంగా 43 పరుగుల తేడాతో టీమిండియా మట్టి కరిపించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. చేసింది స్వల్ప స్కోరు కావడంతో భారత్ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు ఆవిరయ్యాయి. అందులోనూ వెస్టిండీస్ జట్టులో హేమాహేమీలు ఉన్నారు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభం కాకముందే భారత్ ఓడిపోతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. వివియన్ రిచర్డ్స్ మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మదన్ లాల్ బౌలింగ్లో వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని భారత సారథి కపిల్ దేవ్ క్యాచ్ పట్టడం ఇప్పటికీ ఓ చరిత్రే. ఇటీవల విడుదలైన కపిల్ బయోపిక్ ’83’ సినిమాలోనూ ఈ ఘట్టాన్ని చూపించారు. 1983 తర్వాతే భారత్లో క్రికెట్ అంటే అందరికీ మక్కువ పెరిగింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత 2011లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. కాగా టీమిండియాకు ఇది అరుదైన రోజు అంటూ బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.
Also Read
- IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
అటు ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరిగ్గా 90 ఏళ్ల క్రితం ఇదేరోజు టీమ్ ఇండియా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ సమయంలో టెస్టు క్రికెట్ ఆడిన 6వ టీమ్గా ఇండియా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి మొత్తం 562 టెస్టు మ్యాచ్లు ఆడగా..168 గెలిచింది. 173 మ్యాచ్లు ఓడిపోయింది. 220 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
🗓️ #OnThisDay in 1983
A historic day & a landmark moment for Indian cricket as #TeamIndia, led by @therealkapildev, clinched the World Cup title. 🏆 👏 pic.twitter.com/WlqB0DQp1U
— BCCI (@BCCI) June 25, 2022
Ben Stokes: స్టోక్స్ అరుదైన రికార్డు.. 100 సిక్సర్లు.. 100 వికెట్లు..!!
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!