Team India: టీమిండియాకు అరుదైన రోజు.. చరిత్ర సృష్టించి నేటితో 39 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్లో అండర్ డాగ్గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్ సేన చరిత్ర సృష్టించింది. 39 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 25న టీమిండియా తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను సగర్వంగా కైవసం చేసుకుంది. దీంతో క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం మొదలైంది. జూన్ 25న క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బలమైన వెస్టిండీస్ జట్టును ఏకంగా 43 పరుగుల తేడాతో టీమిండియా మట్టి కరిపించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. చేసింది స్వల్ప స్కోరు కావడంతో భారత్ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు ఆవిరయ్యాయి. అందులోనూ వెస్టిండీస్ జట్టులో హేమాహేమీలు ఉన్నారు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభం కాకముందే భారత్ ఓడిపోతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. వివియన్ రిచర్డ్స్ మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మదన్ లాల్ బౌలింగ్లో వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని భారత సారథి కపిల్ దేవ్ క్యాచ్ పట్టడం ఇప్పటికీ ఓ చరిత్రే. ఇటీవల విడుదలైన కపిల్ బయోపిక్ ’83’ సినిమాలోనూ ఈ ఘట్టాన్ని చూపించారు. 1983 తర్వాతే భారత్లో క్రికెట్ అంటే అందరికీ మక్కువ పెరిగింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత 2011లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. కాగా టీమిండియాకు ఇది అరుదైన రోజు అంటూ బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
అటు ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరిగ్గా 90 ఏళ్ల క్రితం ఇదేరోజు టీమ్ ఇండియా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ సమయంలో టెస్టు క్రికెట్ ఆడిన 6వ టీమ్గా ఇండియా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి మొత్తం 562 టెస్టు మ్యాచ్లు ఆడగా..168 గెలిచింది. 173 మ్యాచ్లు ఓడిపోయింది. 220 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
🗓️ #OnThisDay in 1983
A historic day & a landmark moment for Indian cricket as #TeamIndia, led by @therealkapildev, clinched the World Cup title. 🏆 👏 pic.twitter.com/WlqB0DQp1U
— BCCI (@BCCI) June 25, 2022
Ben Stokes: స్టోక్స్ అరుదైన రికార్డు.. 100 సిక్సర్లు.. 100 వికెట్లు..!!
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!