Team India: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బుమ్రా స్థానంలో ఎవరినీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే తాజాగా బుమ్రా స్థానంలో షమీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతంలో స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో షమీ ఉండగా ప్రస్తుతం తుది జట్టులోకి అతడిని తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారము షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడని.. త్వరలో బ్రిస్బేన్లో ఉన్న టీమిండియాతో అతడు కలుస్తాడని…
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ…
T20 Worldcup 2022: టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోగా తాజాగా రిజర్వు ఆటగాడిగా ఎంపికైన ఆల్రౌండర్ దీపక్ చాహర్ కూడా వైదొలిగాడు. అతడు కొద్దిరోజులుగా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే బుమ్రా లేని నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దీపక్ చాహర్ వెళ్తాడని అందరూ భావించారు. ప్రపంచకప్లో సూపర్ 12 మ్యాచ్లు…
T20 Worldcup 2022: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అన్ని పనులు ఆపుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటాం. మరి అలాంటి మ్యాచ్ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ను థియేటర్లలో చూసే అవకాశాన్ని మల్టీప్లెక్సులు కల్పించబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్…
Sourav Ganguly: బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణ ఖరారైంది. గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శిగానే…
MS Dhoni: టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ తన నాయకత్వంలో ఎన్నో టైటిళ్లను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ సహా టెస్టుల్లోనూ నంబర్వన్ స్థానాన్ని అందుకుంది. అటు ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ విజయవంతం అయ్యాడు. చెన్నై జట్టును ఏకంగా నాలుగుసార్లు ఛాంపియన్గా నిలిపిన ఘనతను సాధించాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా ఏ బాధ్యత ఇచ్చినా ధోనీ సమర్థంగా నిర్వర్తించాడు. అందుకే ధోనీ అంటే చాలా…
IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత…
IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జానేమన్ మలాన్…
IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్నే మూడో వన్డేలోనూ…