Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
- సూపర్-8 దశలో గురువారం ఆఫ్ఘనిస్థాన్పై టీమిండియా ఘన విజయం.
- అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్య 15వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’కు ఎంపిక.
- అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లలో కోహ్లీతో సంయుక్తంగా సూర్య కుమార్ యాదవ్.
Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో సూర్య అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థులకు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించిన భారత్.. ఆ తర్వాత బౌలర్లు కూడా చెలరేగిపోవడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ కు ” మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ” అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం ఇది 15వ సారి.
JP Nadda: జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును తాజాగా సూర్య సమం చేసాడు. ఇప్పటి వరకు కొహ్లీ కూడా 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో పాటు సూర్య ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మొత్తం 113 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇకపోతే కేవలం సూర్య కుమార్ యాదవ్ కేవలం 61 మ్యాచ్లలో 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 విభాగంలో నంబర్ 1 బ్యాట్సమెన్ గా కొనసాగుతున్నారు.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇక 2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా శనివారం సూపర్ 8 లో భాగంగా నార్త్ సౌండ్ లో బాంగ్లాదేశ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!