Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..
- సూపర్-8 దశలో గురువారం ఆఫ్ఘనిస్థాన్పై టీమిండియా ఘన విజయం.
- అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్య 15వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’కు ఎంపిక.
- అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాళ్లలో కోహ్లీతో సంయుక్తంగా సూర్య కుమార్ యాదవ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో సూర్య అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థులకు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించిన భారత్.. ఆ తర్వాత బౌలర్లు కూడా చెలరేగిపోవడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ కు ” మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ” అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం ఇది 15వ సారి.
JP Nadda: జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!
Also Read
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును తాజాగా సూర్య సమం చేసాడు. ఇప్పటి వరకు కొహ్లీ కూడా 15 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో పాటు సూర్య ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మొత్తం 113 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇకపోతే కేవలం సూర్య కుమార్ యాదవ్ కేవలం 61 మ్యాచ్లలో 15 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 విభాగంలో నంబర్ 1 బ్యాట్సమెన్ గా కొనసాగుతున్నారు.
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇక 2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా శనివారం సూపర్ 8 లో భాగంగా నార్త్ సౌండ్ లో బాంగ్లాదేశ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?