AV Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్.. ‘నిజం కోసం పోరాటం ఆగదు’
- రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానన్న రంగనాథ్
- రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు రక్షించామని వెల్లడి
- ల్యాండ్ మాఫియానే కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ
- 63 కంటెంప్ట్ కేసులపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A కల్పించిన స్ఫూర్తితోనే పని చేస్తున్నానని, చెరువులు, పార్కులు , ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో మార్కెట్లో దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించిందని వెల్లడించారు. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టే ధైర్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
రూ. 1.50 లక్షల కోట్ల ఆస్తుల పరిరక్షణ , చెరువుల పునరుద్ధరణ
హైడ్రా చేపట్టిన చర్యల వల్ల నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లో నుంచి బయటపడ్డాయని రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించామని అన్నారు.
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ల్యాండ్ మాఫియా
ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ ఆరోపించారు. లోతుకుంట ప్రాంతంలో దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన 120 ఎకరాల ప్రభుత్వ భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 2,500 కోట్ల విలువైన, వందల ఏళ్ల నాటి హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ చెట్లను విచ్ఛలవిడిగా నరికివేశారని మండిపడ్డారు. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదు మేరకే హైడ్రా రంగంలోకి దిగిందని, ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన భూమిని చూపిస్తూ తనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని తెలిపారు.
నాపై ఉన్న 63 కంటెంప్ట్ కేసులు ఆ మాఫియా వేసినవే
తనపై ప్రస్తుతం ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులన్నీ బడా భూకబ్జాదారులు వేసినవేనని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట చెరువును ఆక్రమించాలనుకున్న వ్యక్తి, లోతుకుంటలో వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన బిల్డర్, సామాన్యుల ప్లాట్లు ఆక్రమించి బడా కాంప్లెక్స్లు కట్టాలనుకున్న సంధ్యా శ్రీధర్ రావు, వేలాది మంది సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ వేల కోట్ల ఆస్తులు ఆక్రమించిన ముఖీమ్.. వీరందరి అక్రమాలకు అడ్డుపడటమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
ప్రభుత్వాలు గతంలో, ఇప్పుడు లేదా మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా తన వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇచ్చేలా శ్రమిస్తూనే ఉంటానని ఏవీ రంగనాథ్ తేల్చి చెప్పారు. చట్టపరిధిలోనే బాధ్యతలను నిర్వర్తిస్తూ నగరంలో పర్యావరణాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!