Ind v/s SA : దక్షిణాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల టెస్టులో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి, టీమ్ ఇండియా ఇప్పుడు మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుండగా.. టీమ్ఇండియా 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దక్షిణాఫ్రికా పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉంది.
Read Also:Blast Incident: షాద్నగర్ పేలుడు ఘటన.. విషమంగా ముగ్గురి పరిస్థితి
ఈ వార్త రాసే సమయానికి భారత జట్టు 115 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 603 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్లో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఈ ఏడాది అదే జట్టుపై చేసిన అతిపెద్ద స్కోరు చేసిన ప్రపంచ రికార్డును కలిగి ఉంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 575 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Read Also:Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..