టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యేకంగా ఫొటోలుం షేర్ చేసి శుభాకాంక్షలు పోస్ట్ చేశాయి.
ఇక హోమ్ టీం ఐతే ఏకంగా ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో ‘సలామ్ రోహిత్ భాయ్’ అనే పాటను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. ఇక రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ రోహిత్ యుక్త వయసులో ఉన్న సమయంలోని హిట్మాన్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది. భారత క్రికెట్ లో అజేయమైన శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు., రోహిత్, నీ నాయకత్వం, నీ నైపుణ్యం, ఓటమిని అంగీకరించని నీ వ్యక్తిత్వం మన జట్టు గుండెచప్పుడు. హిట్మ్యాన్.. మరో ఏడాది బౌండరీలు బాదతూ చరిత్ర సృష్టించాలని ‘జై షా’ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపాడు.
ప్రస్తుత ఐపీఎల్ 17 సీజన్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడి 160.31 స్ట్రైక్ రేట్ తో 311 పరుగులు సాధించాడు. అందులో చెన్నైపై ఒక సెంచరీ కూడా సాధించాడు. ఇక నేడు లక్నో, ముంబై జట్లు పోటీపడనున్నాయి. ఈ గేమ్ లో గెలిచి రోహిత్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు.