Home
Covid19
Covid19 News
-
భారత్లో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కొత్త కేసులు
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… మొన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, నిన్న 16,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది.. ఏకంగా 22 వేలను దాటేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 406 మంది కోవిడ్… -
ఈ లక్షణాలుంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి…లేదంటే…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పాలి. రోజువారి కేసుల్లో భారీ పెరుగుదలలు కనిపిస్తున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. అనేక దేశాల్లో పరిస్థితి భారత్ కంటే మరింత దారుణంగా మారింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నా కోవడ్, ఒమిక్రాన్ సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, బాడీపెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం… -
ముంబైలో నిబంధనలు మరింత కఠినం…జనవరి 15 వరకు…
ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్లో అనుమతులను నిరాకరించారు. Read: తెలంగాణలో రికార్డ్… -
విమానంలో ప్రయాణం చేస్తున్న మహిళకు కరోనా… ఐదు గంటలు బాత్రూమ్లోనే…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక, విమానాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశంలేదు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలోని చికాగో నుంచి ఐస్లాండ్కు 159 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకు టెస్టులు చేశారు. Read: వైరల్: టైగర్ దెబ్బకు… -
ఢిల్లీ ఒమిక్రాన్: ఒక్కరోజులో 86శాతం పెరిగిన కేసులు
ఢిల్లీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 923 కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. 50 శాతం సీటింగ్లో హోటళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని,… -
అమెరికాలో దారుణం: ఒక్కరోజులో 5.12 లక్షల కేసులు…
అమెరికాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి 8 వ తేదీన 2.94 లక్షల కేసులు నమదవ్వగా దాదాపు దానికి రెండింతల కేసులు యూఎస్లో ఈ ఒక్కరోజులో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాన్ హోప్కిన్స్ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 5.12 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి మొదలయ్యాక ఈ స్థాయిలో… -
చెన్నైలోనూ పెరుగుతున్న కేసులు… ఒకే వీధిలో మూడు కేసులుంటే…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. ఆరు నెలల కాలం నుంచి కనిష్టంగా నమోదవుతున్న కేసుల్లో అనూహ్యంగా వేగం పుంజుకుంది. వారం రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల అలజడితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, అదే బాటలో ఇప్పుడు చెన్నై కూడా పయనిస్తున్నది. గత రెండు మూడు రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ… -
ముంబైని భయపెడుతున్న కోవిడ్…థర్డ్వేవ్ మొదలైనట్టేనా…!!?
ముంబైలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో నమోదైన కేసులు నిన్నటి నుంచి వేలల్లో నమోదు కావడం మొదలుపెట్టాయి. సోమవారం రోజున 800 కేసులు నమోదవ్వగా, మంగళవారం రోజున 1300 కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజున 2 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాకరే అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలో 70 శాతం మేర కేసులు పెరగడంతో ప్రజలు… -
మహా అసెంబ్లీలో 50 మందికి కరోనా…
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. కరోనా, ఒమిక్రాన్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 22 నుంచి 28 వరకు మొత్తం 5 రోజులపాటు సమావేశాలను నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగపూర్లో నిర్వహించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాలను ముంబైలోనే నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సమయంలో 50 మంది కరోనా బారిన పడినట్టు మహా ఉప ముఖ్యమంత్రి పవార్ తెలిపారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్, మరో మంత్రి… -
యూకేలో 1.30 లక్షల కేసులు… కిటకిటలాడుతున్న ఆసుపత్రులు…
కరోనా, ఒమిక్రాన్తో యూకే వణికిపోతున్నది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ తరువాత కేసులు మరింతగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున యూకేలో 1.30 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లండన్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.…
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి